సిగ్గుతో కూడిన మొహమాటం వల్ల వచ్చిన స్పీచ్ ఇది

ప్రభాస్ మరోసారి తన అభిమానుల్ని నిరాశపరిచాడు. రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్/ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ స్పీచ్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అప్పటివరకు ఓపిగ్గా ఎవరి కోసమైతే వేచి చూశారో.. మధ్యాహ్నం…

ప్రభాస్ మరోసారి తన అభిమానుల్ని నిరాశపరిచాడు. రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్/ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ స్పీచ్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అప్పటివరకు ఓపిగ్గా ఎవరి కోసమైతే వేచి చూశారో.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సభాప్రాంగణం వద్ద చలికి కాచుకుంటూ ఎవరి కోసమైతే వెయిట్ చేశారో.. అతడే చివరాఖర్లో వచ్చి తుస్సుమనిపించేసరికి అభిమానులు ఉసూరుమన్నారు.

అవును.. రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మరోసారి తడబడ్డాడు. పైపైన 3 ముక్కలు మాట్లాడి మమ అనిపించాడు. చివర్లో ఐ లవ్ యూ డార్లింగ్స్ అంటూ ముక్తాయించాడు. అలా మైక్ పట్టుకున్న 3 నిమిషాలకే ప్రసంగం ముగించాడు. యూనిట్ లో సగం మందికి థ్యాంక్స్ చెప్పి, సగం మందిని మరిచిపోయాడు. ట్రయిలర్ గురించి ఇలా మాట్లాడి, అలా ముగించాడు. సినిమాకు పడిన కష్టం గురించి ఇలా స్టార్ట్ చేసి, ఎటో వెళ్లిపోయాడు.

ఇలా తన స్పీచ్ లో అంతా ముక్తసరిగా మాట్లాడాడు ప్రభాస్. ఈ సందర్భంగా తన 'సిగ్గు' ఎలిమెంట్ ను మరోసారి బయటపెట్టాడు కూడా. సాహో ప్రమోషన్ కోసం దేశవ్యాప్తంగా తిరిగిన తనకు ఇక మాట్లాడే విషయంలో సిగ్గుండదని అనుకున్నానని, కానీ అది తన నుంచి ఇప్పట్లో పోయేలా లేదంటూ తననుతానే నిందించుకున్నాడు. ఎంతో మాట్లాడదామని వచ్చి, ఏం మాట్లాడలేకపోతున్నానని తనకుతానే బాధపడ్డాడు.

ఓవరాల్ గా ప్రభాస్ స్పీచ్ లో చెప్పుకోదగ్గ అంశాలేమైనా ఉన్నాయంటే అది రాధేశ్యామ్ క్లైమాక్స్ మాత్రమే. సినిమా క్లైమాక్స్ చాలా హైలెట్ అవుతుందంటున్నాడు. సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయని కూడా చెప్పాడు. అంతకుమించి ప్రభాస్ మొత్తం స్పీచ్ లో చెప్పుకోదగ్గ విశేషాల్లేవు.

Click Here For Photo Gallery