ఫ్యాన్స్ కు మహేష్ సర్కారు ‘డబుల్’ డోస్

సూపర్ స్టార్ మహేష్ కు ఇటు మాస్ ఆడియన్స్…అటు క్లాస్ ఆడియన్స్..ఇద్దరినీ అలరించాలి. మాస్ డోస్ కురిపిస్తూనే, ఫన్ కురిపించాలి. ఇవన్నీ దృష్టి లో పెట్టుకునే సర్కారు వారి పాట సినిమా ట్రయిలర్ ను…

సూపర్ స్టార్ మహేష్ కు ఇటు మాస్ ఆడియన్స్…అటు క్లాస్ ఆడియన్స్..ఇద్దరినీ అలరించాలి. మాస్ డోస్ కురిపిస్తూనే, ఫన్ కురిపించాలి. ఇవన్నీ దృష్టి లో పెట్టుకునే సర్కారు వారి పాట సినిమా ట్రయిలర్ ను అందించినట్లు కనిపిస్తోంది. 

సహజంగా మంచి మాటలు అందించే దర్శకుడు పరుశురామ్ ట్రయిలర్ లో చక్..చక్ మని మాటలు వినిపించేలా చేసారు. కొంచెం డబుల్ మీనింగ్ అనిపించినా, తన గురువు పూరి స్టయిల్ గుర్తుకు వచ్చేలా జాగ్రత్త పడ్డాడు. అదే టైమ్ లో కామెడీని మిస్ కాలేదు.

ఇక యాక్షన్ పార్ట్ చెప్పనక్కరలేదు. వెన్నెల కిషోర్..మహేష్ ట్రాక్ కచ్చితంగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా వుంది. ఇక ‘నేను విన్నాను..నేను ఉన్నాను..’.,డైలాగు కాస్త హడావుడి చేసేలాగే వుంది సోషల్ మీడియాలో.

సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12న విడుదల కాబోతోంది. థమన్ సంగీతంలో పాటలు ఇప్పటికే ప్రఙాదరణ పొందాయి. కళావతి సాంగ్ వైరల్ అయింది. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ సినిమా ఇదే. అలాగే గీత గోవిందం తరువాత పరుశురామ్ సినిమా ఇదే.

మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్ గా వున్నారు. అమెరికాలో డబ్బులు వడ్డీకి ఇచ్చే ప్రొఫెషన్ లో మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.