దారుణం.. కన్నకూతురిపై అత్యాచారం

రానురాను మహిళలకు భద్రత లేకుండా పోతోంది. భర్త ఇబ్బంది పెడుతున్నాడని పుట్టింటికి వచ్చిన మహిళపై, కన్నతండ్రి అఘాయిత్యం చేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. Advertisement నందిగామ మండలం…

రానురాను మహిళలకు భద్రత లేకుండా పోతోంది. భర్త ఇబ్బంది పెడుతున్నాడని పుట్టింటికి వచ్చిన మహిళపై, కన్నతండ్రి అఘాయిత్యం చేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది.

నందిగామ మండలం అంబారుపేట గ్రామానికి చెందిన మహిళకు, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. దీంతో వివాహిత తన పుట్టింటికి వచ్చేసింది.

అలా ఇంట్లోనే ఉన్న కూతురుపై ఆ దుర్మార్గపు తండ్రి కన్నేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకసారి, రెండు సార్లు కాదు.. దాదాపు రెండేళ్లుగా ఇదే వ్యవహారం నడుస్తోంది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

అలా రెండేళ్లుగా నరకం చూసిన ఆ మహిళ, ఇక తప్పని పరిస్థితుల మధ్య నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ దుర్మార్గపు తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది.

ఇలాంటిదే మరో ఘటన.

హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కూతురు వరసైన ఓ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. దుమ్మాయిగూడెం ప్రాంతానికి చెందిన అనీల్ కు, బోడుప్పల్ కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో క్లోజ్ గా ఉన్నట్టు నటించిన అనీల్, ఆమె కూతురిపై కన్నేశాడు.

నిన్న రాత్రి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తల్లికూతురు ఇద్దరూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.