త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న హీరోహీరోయిన్లు?

సౌత్ లో మరో సెలబ్రిటీ కపుల్ రెడీ అవుతోంది. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకుంటున్న ఓ హీరోయిన్, మరో హీరో త్వరలోనే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. వాళ్లే హీరో గౌతమ్…

సౌత్ లో మరో సెలబ్రిటీ కపుల్ రెడీ అవుతోంది. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకుంటున్న ఓ హీరోయిన్, మరో హీరో త్వరలోనే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. వాళ్లే హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయమే చాలామందికి తెలీదు, అలాంటిది ఏకంగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.

2019లో వచ్చిన దేవరాట్టమ్ అనే సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అప్పుడే వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పట్నుంచి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని కోలీవుడ్ టాక్. కరోనా టైమ్ లో ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగిందట. వాలంటైన్స్ డే సందర్భంగా ఇద్దరూ కలిసి చెన్నైలో కనిపించడంతో ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్టయింది. ఈ ఏడాదిలోనే వీళ్లిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది.

ప్రముఖ నటుడు కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్. మణిరత్నం తీసిన కడలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక మంజిమా మోహన్, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటించింది. తాజాగా వచ్చిన ఎఫ్ఐఆర్ అనే సినిమాలో కూడా నటించింది.

ప్రస్తుతం నటిగా మంజిమా, నటుడిగా గౌతమ్ ఇద్దరూ బిజిగా ఉన్నారు. ఒప్పుకున్న సినిమాల్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి అప్పుడు పెళ్లికి సిద్ధమవ్వాలనేది వీళ్ల ప్లాన్. వీళ్లిద్దరి పెళ్లి విషయాన్ని గౌతమ్ తండ్రి కార్తీక్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.