గోపీచంద్ తో..బెల్లంకొండతో కాదట

ఒకప్పుడు హిట్ డైరక్టర్ శ్రీను వైట్ల. కానీ ఓడలు బండ్లయ్యాయి. దాంతో సినిమా చేతిలోకి రాలేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కానీ కుదరడం లేదు. ఇప్పుడు ఆఖరికి ఓ హీరో అయితే ఓకె…

ఒకప్పుడు హిట్ డైరక్టర్ శ్రీను వైట్ల. కానీ ఓడలు బండ్లయ్యాయి. దాంతో సినిమా చేతిలోకి రాలేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కానీ కుదరడం లేదు. ఇప్పుడు ఆఖరికి ఓ హీరో అయితే ఓకె అన్నారు. నిర్మాత రెడీ అయ్యారు. ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనేదే తెలియాలి. 

ఇంతకీ శ్రీను వైట్లను నమ్మి ఓకె చెప్పింది ఎవరు అంటే..హీరో గోపీచంద్ అన్నది ఆన్సర్. ప్రస్తుతం ఓ సినిమాను గోపీచంద్ కన్నడ డైరక్టర్ తో నిర్మాత రాధా మోహన్ తో చేస్తున్నారు.

దాని తరువాత కూడా అదే నిర్మాతకు శ్రీను వైట్ల కాంబినేషన్ లో చేయడానికి ఓకె అన్నారట. మరి ఇదిలా వుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇదే నిర్మాత ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సాక్షి రామ్ రెడ్డి లేదా ప్రియదర్శిని రామ్ గా పేరు తెచ్చుకున్న రామ్ ఓ కథ చెప్పి ఒప్పించారు. సరైన దర్శకుడితో బెల్లంకొండ ఈ సినిమా చేస్తారు.

ఈ రెండు ప్రాజెక్ట్ లు కూడా ఇప్పటికిప్పుడే సెట్ మీదకు వెళ్లేవి కాదు. ఇప్పటికే రాధామోహన్ ఓ హిందీ సినిమా నిర్మిస్తున్నారు. గొపీచంద్ సినిమా నిర్మిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత సంగతి. కప్ టు లిప్ అన్నట్లు ఇంకా చాలా సంగతులు వున్నాయి ఈ ప్రాజెక్టులు మెటీరియలైజ్ కావడానికి.