బాలీవుడ్ లోకి మరో తెలుగు దర్శకుడు

తెలుగు దర్శకులు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారం. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో దర్శకుడు చేరాడు. అతడే గోపీచంద్ మలినేని. తెలుగులో క్రాక్, వీరసింహారెడ్డి లాంటి హిట్స్ ఇచ్చిన ఈ…

తెలుగు దర్శకులు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారం. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో దర్శకుడు చేరాడు. అతడే గోపీచంద్ మలినేని. తెలుగులో క్రాక్, వీరసింహారెడ్డి లాంటి హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు, తొలిసారి బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు.

సన్నీ డియోల్ హీరోగా ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా హిందీలో నిర్మించబోతున్నాయి.

4 దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నాడు సన్నీ డియోల్. గతేడాది గదర్-2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.

ఈరోజు ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టారు. 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. సయామీ ఖేర్, రెజీనాను 2 కీలక పాత్రల కోసం తీసుకున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.