టాలీవుడ్ లో గ్యాప్.. బాధ లేదంటున్న హీరోయిన్

ఓ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గితే, మరో ఇండస్ట్రీకి హీరోయిన్లు జంప్ కొడుతుంటారు. హీరోయిన్ హన్సిక కూడా అలానే కోలీవుడ్ కు షిఫ్ట్ అయింది. తెలుగులో ఆమెకు బాగా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ గ్యాప్…

ఓ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గితే, మరో ఇండస్ట్రీకి హీరోయిన్లు జంప్ కొడుతుంటారు. హీరోయిన్ హన్సిక కూడా అలానే కోలీవుడ్ కు షిఫ్ట్ అయింది. తెలుగులో ఆమెకు బాగా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ గ్యాప్ వల్ల తను బాధపడడం లేదని అంటోంది ఈ ఆపిల్ పిల్ల.

ఊహించని విధంగా తమిళ్ లో బిజీ అయ్యానని, అందుకే తెలుగులో అనివార్యంగా గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చింది హన్సిక. ఏదో ఒక ఇండస్ట్రీలో బిజీగా ఉండడమే ముఖ్యమని, అందుకే టాలీవుడ్ లో గ్యాప్ వచ్చినా పెద్దగా బాధపడలేదని అంటోంది.

ఇప్పటివరకు కెరీర్ లో ఒక్కసారి కూడా బాధపడలేదంటోంది హన్సిక. అవకాశాలు ఉన్నా, లేకున్నా తను ఒకేలా ఉంటానని, నటన పరంగా మాత్రం ఇంకా సంతృప్తి దక్కలేదని చెబుతోంది. మరిన్ని మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నట్టు వెల్లడించింది.

టాలీవుడ్ కు దూరమైనప్పటికీ ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో వర్క్ చేసిన ఆనందం ఉందంటోంది హన్సిక. పాన్ ఇండియా లెవెల్లో వీళ్లిద్దరూ క్లిక్ అవ్వడం తనకు చాలా గర్వకారణం అంటోంది. వాళ్ల కష్టానికి ఇన్నాళ్లకు గుర్తింపు దక్కిందంటోంది. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమా చేసింది హన్సిక. రేపు థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ.