ఒకే సినిమాతో హీరోయిన్ నుంచి కీలక పాత్రకు షిఫ్ట్

సాధారణంగా సీక్వెల్ తీస్తున్నప్పుడు నటీనటులు పెద్దగా మారరు. వాళ్ల పాత్రల్లో వాళ్లే కొనసాగుతుంటారు. ఒకవేళ మార్చాల్సి వస్తే టోటల్ సెటప్ మార్చేస్తుంటారు తప్ప కీలక పాత్రల్ని అటుఇటు చేయరు. కానీ త్వరలోనే రాబోతున్న ఓ…

సాధారణంగా సీక్వెల్ తీస్తున్నప్పుడు నటీనటులు పెద్దగా మారరు. వాళ్ల పాత్రల్లో వాళ్లే కొనసాగుతుంటారు. ఒకవేళ మార్చాల్సి వస్తే టోటల్ సెటప్ మార్చేస్తుంటారు తప్ప కీలక పాత్రల్ని అటుఇటు చేయరు. కానీ త్వరలోనే రాబోతున్న ఓ సీక్వెల్ లో మాత్రం హీరోయిన్ ను ఏకంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మార్చేశారు.

ఓదెల రైల్వే స్టేషన్.. రెండేళ్ల కిందటొచ్చిన క్రైమ్ థ్రిల్లర్. హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అప్పట్లో ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ చేశాడు సంపత్ నంది.

ఓదెల-2 పేరిట కొత్త సినిమా మొదలైంది. వారణాసిలో ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇందులో లీడ్ రోల్ కోసం తమన్నాను తీసుకున్నారు. మొదటి భాగంలో లీడ్ రోల్ పోషించిన హెబ్బా పటేల్ కూడా ఉంది. కాకపోతే ఆమెను కీలక పాత్రకు పరిచయం చేశారు.

ఓదెల-2ను మరింత పెద్దగా తీయాలని నిర్ణయించారు. అందుకే తమన్నాను తీసుకున్నారు. సంపత్ నంది అడగడంతో తమన్న ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకుంది. వీళ్లిద్దరూ గతంలో రచ్చ, సీటీమార్ లాంటి సినిమాలు కలిసిచేశారు. 

ఓదెల-2లో క్రియేటివ్ పార్ట్ మొత్తం సంపత్ నందిదే. దర్శకత్వ బాధ్యతలు మాత్రం అశోక్ తేజకు అప్పగించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. భోళాశంకర్ తర్వాత తెలుగులో తమన్న అంగీకరించిన ప్రాజెక్ట్ ఇదే.