ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఆ హీరోయిన్ సేఫ్

ఊహించని విధంగా ఇజ్రాయెల్ పై పాలస్తీనా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ నష్రూత్ బరూచా తప్పిపోయింది.…

ఊహించని విధంగా ఇజ్రాయెల్ పై పాలస్తీనా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ నష్రూత్ బరూచా తప్పిపోయింది. కొన్ని గంటల పాటు ఆమె ఆచూకి లభ్యం కాలేదు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అయితే ఎట్టకేలకు నష్రూత్ బరూచాను ఆమె బృందం కనుగొంది. అంతేకాదు, ఆమెను సేఫ్ గా ఇండియాకు తీసుకొచ్చింది. ఈరోజు నష్రూత్, ఇండియాలో ల్యాండ్ అయింది. విమానాశ్రయంలో దిగిన ఆమె, నేరుగా తన నివాసానికి వెళ్లిపోయింది. మధ్యలో కలిసిన మీడియాకు కూడా ఆమె స్పందించలేదు. చూస్తుంటే, ఆమె షాక్ లో ఉన్నట్టుగా కనిపించింది.

ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లింది నష్రూత్. టూర్ అంతా సాఫీగా సాగుతుందనుకున్న టైమ్ లో హఠాత్తుగా రాకెట్ల వర్షం కురిసింది. దీంతో కొంతమందితో కలిసి నష్రూత్ దగ్గర్లో ఉన్న బేస్ మెంట్ కు చేరుకుంది. తను ఓ బంకర్ లాంటి ప్రదేశానికి చేరుకున్నానంటూ తన టీమ్ కు చివరిసారి సమాచారం అందించింది.

అప్పట్నుంచి ఆమెను వెదుకుతూనే ఉంది టీమ్. ఎట్టకేలకు నష్రూత్ ఆచూకి లభ్యమైంది. వెంటనే ఆమెను ఇజ్రాయెల్ నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్ ద్వారా ఇండియాకు తీసుకొచ్చారు. అలా అత్యంత భయంకరమైన అనుభవంతో, ఇజ్రాయెల్ నుంచి ఇండియాకొచ్చింది ఈ హీరోయిన్.