హీరోయిన్ శ‌ర్మిలా మండ్రే క‌రోనా బారిన ప‌డ్డారు

వివాదాస్ప‌ద హీరోయిన్ శ‌ర్మిలా మండ్రే క‌రోనా బారిన ప‌డ్డారు. క‌న్న‌డ హీరోయిన్ అయిన ఆమె టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మే. తెలుగులో అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ‘కెవ్వుకేక’ చిత్రంలో న‌టించారామె. శ‌ర్మిలాతో పాటు ఆమె కుటుంబ…

వివాదాస్ప‌ద హీరోయిన్ శ‌ర్మిలా మండ్రే క‌రోనా బారిన ప‌డ్డారు. క‌న్న‌డ హీరోయిన్ అయిన ఆమె టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మే. తెలుగులో అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ‘కెవ్వుకేక’ చిత్రంలో న‌టించారామె. శ‌ర్మిలాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను క‌రోనా విడిచి పెట్ట‌లేదు. సోష‌ల్ మీడియా ద్వారా తాను, త‌న కుటుంబం క‌రోనా బారిన ప‌డిన విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట తిరుగుతూ ర‌చ్చ‌ర‌చ్చ చేసిన హీరోయిన్‌గా ఆమె వివాదాస్ప‌ద‌మ‌య్యారు. అలాగే తాజాగా క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను కుదిపేస్తున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలోనూ ఆమెకు ప్ర‌మేయం ఉంద‌నే వార్త‌లొస్తున్నాయి. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో త‌న పేరు ప్ర‌చారం కావ‌డంపై ఆమె మండిప‌డుతున్నారు.

టీఆర్పీల కోసం కొన్ని వార్తా చాన‌ళ్లు త‌న పేరును తెరపైకి తెచ్చాయ‌ని శ‌ర్మిలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న ఎదుగుద‌ల వెనుక ఏళ్ల త‌ర‌బ‌డి కృషి ఉంద‌ని, దాన్ని గుర్తించి త‌ప్పుడు ప్ర‌చారం మానుకోవాల‌ని ఆమె హిత‌వు ప‌లికారు.

ఇక క‌రోనా విష‌యానికి వ‌స్తే….ప్ర‌స్తుతం తాను హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ వైద్యుల స‌ల‌హాల‌తో చికిత్స తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. త్వ‌ర‌గా కోలుకుని తిరిగి యాక్టీవ్ అవుతాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. 

నేను బూతులు తిడితే బ్రతకగలవా