నాని సమర్పణలో, ప్రశాంతి నిర్మించిన సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ధ్రిలర్ సినిమా ఇది. రీజనబుల్ బజ్ తో విడుదలయిన ఈ మూవీకి లిమిటెడ్ స్క్రీన్ లే దక్కాయి. ముఖ్యంగా అలవైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరు సినిమాలు యాభై రోజుల కోసం థియేటర్లలో వుండిపోవడం, భీష్మ ఇంకా రెండో వారమే కావడంతో థియేటర్లు అంతగా దొరకలేదు.
దాంతో తొలి రోజు ఓ మాదిరిగా అంకెలు కనిపిస్తున్నాయి. నైజాం, వైజాగ్ కలిపి రెండు కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు. ఈ రెండు కలిపి తొలి రోజు వన్ థర్డ్ రికవరీ వచ్చింది. ఆంధ్ర రెండు కోట్ల రేషియోలో ఇచ్చారు. తొలి రోజు యాభై వరకు వెనక్కు వచ్చింది. అందువల్ల బయ్యర్లు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు