ఓజీ నుంచి జీ2 వరకు..

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి. ఆ సినిమా ఇంకా నిర్మాణ దశలో ఉంటుండగానే, మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం అందుకున్నాడు.…

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి. ఆ సినిమా ఇంకా నిర్మాణ దశలో ఉంటుండగానే, మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం అందుకున్నాడు. ఈసారి ఇమ్రాన్ అంగీకరించిన మూవీ జీ2.

అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా జీ2. సూపర్ హిట్టయిన గూఢచారి సినిమాకు సీక్వెల్ ఇది. ఇందులో విలన్ పాత్ర కోసం ఇమ్రాన్ ను తీసుకున్నారు. కథ-స్క్రీన్ ప్లే విన్న వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పానని స్వయంగా ఇమ్రాన్ హస్మి ప్రకటించాడు.

రీసెంట్ గా వచ్చిన టైగర్ 3లో విలన్ గా నటించాడు ఇమ్రాన్. అందులో అతడి పెర్ఫార్మెన్స్ చూసి జీ2 కోసం తీసుకున్నారట. హస్మి రాకతో తమ సినిమా రేంజ్ మరింత పెరిగిందని ప్రకటించింది పీపుల్ మీడియా బ్యానర్.

ఇదే సినిమాతో కొత్త హీరోయిన్ కూడా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ సరసన బనిత సంధును హీరోయిన్ గా తీసుకున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించారు. ఇప్పుడు విలన్ పాత్రధారిని కూడా ఎనౌన్స్ చేశారు. 

ఈ రెండు ఎంపికలతో సినిమా షూటింగ్ ఊపందుకునే అవకాశం ఉంది. వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మి రాకతో జీ2కు పాన్ ఇండియా అప్పీల్ ఇంకాస్త పెరిగింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.