Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇప్పుడు దిల్ రాజు నిజాయితీగా మాట్లాడతారేమో..?

ఇప్పుడు దిల్ రాజు నిజాయితీగా మాట్లాడతారేమో..?

ఫ్యామిలీ స్టార్ రిలీజైన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు నిర్మాత దిల్ రాజు. దర్శకుడు పరశురాం, హీరోయిన్ మృణాల్ తో కలిసి మీడియా ముందుకొచ్చారు. సినిమాలో లోపాలపై మీడియా ఎన్ని ప్రశ్నలడిగినా తిప్పికొట్టారు. రివ్యూల్లో ఇచ్చే స్టేట్ మెంట్స్ వ్యక్తిగతమన్నారు. వాటిని లెక్కలోకి తీసుకుంటామంటూనే, కొర్రీలు పెట్టారు.

సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోందని ఘనంగా చెప్పుకున్నారు. తను ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడతానని, ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో రివ్యూస్ కు భిన్నంగా పబ్లిక్ టాక్ ఉందని అన్నారు. 90 శాతం కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

అయితే దిల్ రాజు చెప్పింది జరగలేదనే విషయం ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికే తెలిసిపోయింది. అయినప్పటికీ అంతా వెయిట్ చేశారు. ఎందుకంటే, ఉగాది, రంజాన్ లాంటివి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అవి కూడా అయిపోయాయి. వాటితో పాటు మరో వీకెండ్ కూడా గడిచింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అసలు స్వరూపం బయటపడింది.

బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకోనే స్థితిలో కూడా లేదు ఈ సినిమా. దిల్ రాజు చెప్పిన ఫ్యామిలీ ఆడియన్స్ ఎవ్వరూ ఈ సినిమా చూడలేదు. ఈరోజు నుంచి చాలా స్క్రీన్స్ లో ఫ్యామిలీ స్టార్ సినిమాను తప్పించారు. ఓవైపు పెద్ద సినిమాలేవీ లేనప్పటికీ, ఆక్యుపెన్సీ లేక సినిమాను తప్పించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. ఇక మాట్లాడాల్సింది దిల్ రాజు మాత్రమే. ఇప్పటికైనా రివ్యూస్ లో చెప్పిందే నిజమైందని ఆయన అంగీకరిస్తారేమో చూడాలి. ఎందుకంటే దిల్ రాజు ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడతారు కదా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?