ఇటు జాన్వి, అటు మృణాల్.. అస్సలు తగ్గట్లేదుగా!

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉండేదే. ఓ హీరోయిన్ 4-5 సినిమాలు చేసిందంటే చాలు, ఓల్డ్ అయిపోయినట్టే. వెంటనే మరో హీరోయిన్ కావాలి మన హీరోలకు. అందుకే ఇండస్ట్రీలోకి ఎప్పుడూ హీరోయిన్లు వస్తూనే…

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉండేదే. ఓ హీరోయిన్ 4-5 సినిమాలు చేసిందంటే చాలు, ఓల్డ్ అయిపోయినట్టే. వెంటనే మరో హీరోయిన్ కావాలి మన హీరోలకు. అందుకే ఇండస్ట్రీలోకి ఎప్పుడూ హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో కాస్త క్రేజ్ తెచ్చుకున్న భామలుంటే, ఇక రెమ్యూనరేషన్ చుక్కల్ని తాకాల్సిందే.

ప్రస్తుతం ఇద్దరు ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో అదే పనిలో ఉన్నారు. తమ పారితోషికాల్ని తాజాగా సవరించారు. వాళ్లలో ఒకరు జాన్వి కపూర్ కాగా, మరొకరు మృణాల్ ఠాకూర్.

పూజాహెగ్డే పాపులారిటీ తగ్గడం, రష్మిక బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో.. టాలీవుడ్ లో ఏర్పడిన గ్యాప్ ను జాన్వి, మృణాల్ బాగా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా జాన్వి కపూర్ రికార్డ్ సృష్టించింది.

ఎన్టీఆర్ సరసన దేవర అనే సినిమా చేస్తోంది జాన్వి కపూర్. ఈ సినిమా కోసం ఆమె అక్షరాలా 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందంట. రష్మిక, పూజాహెగ్డే లాంటి హీరోయిన్లు 3 కోట్లు రేంజ్ లోనే ఉన్న టైమ్ లో, జాన్వి ఇలా 4 కోట్లకు తన పారితోషికాన్ని చేర్చింది. బాలీవుడ్ లో అంతోఇంతో పాపులారిటీ ఉండడం, శ్రీదేవి కూతురు అనే ఇమేజ్ ఈమెకు ప్లస్ పాయింట్స్ గా మారాయి.

ఇక సీతారామం ఇచ్చిన సక్సెస్ ను మృణాల్ ఠాకూర్ కూడా క్యాష్ చేసుకుంటోంది. ఓవైపు ఆ సక్సెస్ తో పాటు, మరోవైపు హీరోయిన్ల కొరత ఉండడం ఈ ముద్దుగుమ్మకు కలిసొచ్చింది. ప్రస్తుతం మూడున్నర నుంచి 4 కోట్ల రూపాయల వరకు తీసుకుంటోందట మృణాల్. ఇప్పటికే 'హాయ్ నాన్న' సినిమాలో నటిస్తున్న మృణాల్, విజయ్ దేవరకొండ-పరశురామ్ సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్వింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల. కానీ ఆమె ఫుల్ బిజీ అయిపోయింది. మరో సినిమాకు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో మృణాల్, జాన్వికి ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.