Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ తో నా బంధాన్ని కమర్షియల్ చేయలేను

ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే చాలా బాగుంటుంది. నందమూరి అభిమానుల కామన్ కోరిక ఇది. దీనిపై చాలా నిజాయితీగా స్పందించాడు కల్యాణ్ రామ్. మల్టీస్టారర్ ఆలోచన తమ మధ్య ఎప్పుడూ రాలేదని, అయినా మల్టీస్టారర్ సినిమా కంటే తారక్ తో బంధం తనకు ముఖ్యమంటున్నాడు కల్యాణ్ రామ్.

"కలిసి నటించాలనే ఆలోచన, ఆ చర్చ నాకు-తారక్ మధ్య ఎప్పుడా రాలేదు. అవసరం లేకుండా ఎందుకు ఊరికే కనిపించడం అనేది మా భావన. నా ప్రొడక్షన్ హౌజ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది. అందులో తారక్ నటిస్తే అదే చాలు. అయినా రిలేషన్ షిప్స్ అనేవి చాలా ముఖ్యం. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది. దాన్ని కమర్షియలైజ్ చేయదలుచుకోలేదు."

అంతా ఓకే అయి, చెక్కులు కూడా అందుకున్న తర్వాతే కొత్త సినిమాను ఎనౌన్స్ చేస్తానంటున్నాడు కల్యాణ్ రామ్. దీనికి సంబంధించి తన కెరీర్ లో జరిగిన ఓ ఘటనను సెంటిమెంట్ గా చెప్పుకొచ్చాడు.

"నా నెక్ట్స్ సినిమా ఏంటనేది అంతా ఓకే అయితే తప్ప బయటకు చెప్పను. ఎందుకంటే, గతంలో అభిమన్యుడు అనే సినిమా తర్వాత ఇలానే ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఆఘమేఘాల మీద స్టార్ట్ చేశారు. కాస్త ఆగుదామని చెప్పినా వినలేదు. ఏం అనుకోకుండా సెట్స్ పైకి వెళ్లాం. అది ఆగిపోయింది. అప్పట్నుంచి అంతా పక్కా అయితే తప్ప సినిమా ప్రకటించకూడదని నిర్ణయించుకున్నాను. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని, చెక్కులు అందుకున్న తర్వాతే ప్రకటన."

ఓ ఫాంటసీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు కల్యాణ్ రామ్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చేయాల్సిన సినిమాతో పాటు.. తన సొంత బ్యానర్ పై ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా గురించి కూడా ఏమీ చెప్పలేదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అంతా ఓకే అయిన తర్వాతే అఫీషియల్ గా ప్రకటిస్తానంటున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?