Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆమె డిశ్చార్జ్ అయింది.. ఈమె జాయిన్ అయింది

ఆమె డిశ్చార్జ్ అయింది.. ఈమె జాయిన్ అయింది

బాలీవుడ్ ను కరోనా వదలడం లేదు. మొన్నటికిమొన్న సింగర్ కనికా కపూర్ కు కరోనా సోకింది. ఆమెకు పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే బాలీవుడ్ మొత్తం షాక్ అయింది. ఎంతో ప్రహసనం తర్వాత కనికా కపూర్ కోలుకుంది. నెగెటివ్ రావడంతో ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవథిలోనే బాలీవుడ్ నుంచి మరో పాజిటివ్ కేసు బయటపడింది.

షారూక్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్, నిర్మాత కరీమ్ మొరానీ కూతురు జోయా మొరానీకి కరోనా సోకింది. ఆల్వేజ్ కభీ కభీ, మస్తాన్, భాగ్ జానీ లాంటి సినిమాల్లో నటించిన జోయా. సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గత నెల శ్రీలంక వెళ్లి వచ్చింది జోయా. కానీ స్వీయ నిర్బంధంలో ఉండలేదు. ఆ తర్వాత రాజస్థాన్ కూడా వెళ్లొచ్చింది.

కాస్త నలతగా ఉండడంతో టెస్టులు చేయించుకుంది. ఆమెకు పాజిటివ్ అని తేలడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. జోయా అక్క షాజా మొరానీకి కూడా నిన్ననే పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను నానావతి హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా ఘటనతో కరీమ్ మొరానీ, ఆయన భార్యను సెల్ఫ్ క్వారంటీన్ లో ఉంచారు. వాళ్ల శాంపిల్స్ ను కూడా టెస్టుల కోసం పంపారు. ఆ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం జోయా ట్రావెల్ హిస్టరీని ట్రాక్ చేసే పనిలో పడ్డారు అధికారులు.

లాక్ డౌన్ లో హైదరాబాద్ ఏరియల్ వ్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?