Advertisement

Advertisement


Home > Movies - Movie News

కంటినిండా నిద్రపోతా-సందీప్

కంటినిండా నిద్రపోతా-సందీప్

గతవారం రోజులుగా విపరీతమైన టెన్షన్ తో వున్నానని, సినిమా రిజల్ట్ చూసిన తరువాత ఇప్పుడు ప్రశాంతంగా వుందని, ఇక కంటినిండా నిద్రపోతానని హీరో సందీప్ కిషన్ అన్నారు. ఆయన  కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు.  మార్నింగ్ షో నుండి సినిమాకు హిట్ టాక్ రావడంతో యూనిట్ సంబరాల్లో మునిగింది. టపాసులు కాల్చి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ  ‘‘తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.  కంటినిండా నిద్రపోయి సుమారు వారం రోజులైంది. ఎంతో నమ్మి సినిమా తీశాం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని టెన్షన్‌ పడ్డాను. శుక్రవారం ఒంటిగంటకు ఫోన్‌ స్విచ్ఛాన్‌ చేశా. చాలామంది ఫోనులు చేశారు. ప్రతి ఒక్కరు ‘చాలా మంచి సినిమా తీశారు భయ్యా. ఫస్టాఫ్‌ అదిరిపోయింది. లాస్ట్‌లో ఎమోషన్‌ అదిరిపోయింది’ అని చాలా పాజిటివ్‌గా చెబుతున్నారు'' అని అన్నారు.

మదర్‌ అండ్‌ ఫాదర్‌ ఎమోషన్‌ను ఇన్నాళ్లు బయటపెట్టలేదు. థియేటర్లలో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా ఉండాలనుకున్నాం. ఆ ఎమోషన్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది.  చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోనులు చేశారు. కలెక్షన్లు బావున్నాయని చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత ఎనర్జీ, ఎగ్జైట్‌మెంట్‌ వచ్చాయి. స్పెషల్‌ థ్యాంక్స్‌ టు ధమన్‌. ప్రతి రివ్యూలో ఆర్‌ఆర్‌ ఇరగదీశాడని రాశారు. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి రెండు రోజుల్లో సక్సెస్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నా. ప్రేక్షకులందరినీ నేరుగా కలవాలని అనుకుంటున్నా'' అని అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?