కంగ‌నా ర‌నౌత్ ఓ మెంట‌ల్ కేసు

బాలీవుడ్ క్వీన్‌, ఫైర్‌బ్రాండ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఓ మెంట‌ల్ కేసుగా శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ అభివ‌ర్ణించారు. కంగ‌నా, సంజ‌య్ మ‌ధ్య రోజురోజుకూ మాట‌ల యుద్ధం తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ముంబై పోలీసుల‌పై విశ్వాసం లేకుంటే…

బాలీవుడ్ క్వీన్‌, ఫైర్‌బ్రాండ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఓ మెంట‌ల్ కేసుగా శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ అభివ‌ర్ణించారు. కంగ‌నా, సంజ‌య్ మ‌ధ్య రోజురోజుకూ మాట‌ల యుద్ధం తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ముంబై పోలీసుల‌పై విశ్వాసం లేకుంటే న‌గ‌రంలోకి రావ‌ద్ద‌ని సంజ‌య్ రౌత్ త‌న‌ను బెదిరించార‌ని కంగ‌నా ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఆమె కామెంట్స్‌పై సంజ‌య్ రౌత్ ఘాటుగా స్పందించారు.

‘ఆమె ఓ మెంటల్‌ కేసు..తను తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నాయి’ అని రౌత్ ఘాటుగా విమ‌ర్శించారు. తాము ఎవరినీ బెదిరించబోమని, ముంబై నగరాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదన్నారు. కానీ ముంబై, మహారాష్ట్రలను కించపరచడాన్ని తాము ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

సుశాంత్‌ మృతి కేసుకు సంబంధించి ముంబై పోలీసుల దర్యాప్తుపై కంగనా రనౌత్‌ ప్రశ్నలు లేవనెత్తిన విష‌యం తెలిసిందే. ఆమె ప్ర‌శ్న‌ల‌పై  సంజయ్‌ రౌత్ అభ్యంతరం తెలిపారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ముంబైలో అడుగుపెట్టరాదని స‌ద‌రు ఎంపీ తనను బెదిరించారని, ముంబైని చూస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని ఆమె ట్వీట్ చేయ‌డం వివాదానికి దారి తీసింది. మున్ముందు సుశాంత్ కేసు ఇంకెన్నీ చిత్ర‌విచిత్రాల‌కు దారి తీస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి ఉంది.

బాలీవుడ్‌లో సినిమా చేయాల‌నే కోరిక లేదు