Advertisement

Advertisement


Home > Movies - Movie News

మొగుల్తూరు తీరప్రాంతంలో కృష్ణంరాజు స్మృతివనం!

మొగుల్తూరు తీరప్రాంతంలో కృష్ణంరాజు స్మృతివనం!

సినీ రంగానికి రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు చేసిన సేవ‌ల‌కు గుర్తుగా మొగల్తూరు తీర‌ప్రాంతంలో రెండు ఎక‌రాల్లో కృష్ణంరాజు స్మృతివ‌నం ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు ప్ర‌క‌టించారు. కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ కోసం స్వ‌గ్రామం కొసం వ‌చ్చిన ఏపీ మంత్రులు కృష్ణంరాజు ఫ్యామిలీని త‌మ‌ క‌లిసి సానుభూతి తెలిపారు.

కృష్ణంరాజు మ‌ర‌ణం అభిమానుల‌కు, సిని రంగానికి జిల్లా ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోట‌ని మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, కార‌మూరి నాగేశ్వ‌ర రావు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు తెలిపారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరులో నిర్వ‌హించిన సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాల్గొని నివాళులు అర్పించారు.

దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభాస్ సొంత గ్రామానికి విచ్చేయ‌డంతో అభిమానులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. సంస్మరణ సభ నిమిత్తం వచ్చిన దాదాపు లక్షమంది అభిమానులకు ప్రభాస్ ఫ్యామిలీ భోజన ఏర్పాట్లు చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?