ఆ సినిమా చూసి ఏడ్చిన కృతి శెట్టి

కొన్ని సినిమాల్లో సన్నివేశాలు చూసి ప్రేక్షకులు కంటతడి పెడుతుంటారు. అయితే ఆ సన్నివేశాల్లో నటించిన నటీనటులకు మాత్రం అంత ఫీలింగ్ ఉండదు. అయితే కృతి షెట్టి మాత్రం దీనికి అతీతం. తను నటించిన బంగార్రాజు…

కొన్ని సినిమాల్లో సన్నివేశాలు చూసి ప్రేక్షకులు కంటతడి పెడుతుంటారు. అయితే ఆ సన్నివేశాల్లో నటించిన నటీనటులకు మాత్రం అంత ఫీలింగ్ ఉండదు. అయితే కృతి షెట్టి మాత్రం దీనికి అతీతం. తను నటించిన బంగార్రాజు సినిమా చూసి ఏడ్చేసిందట ఈ ముద్దుగుమ్మ. దానికి ఓ కారణం కూడా ఉందని చెబుతోంది.

“బంగార్రాజు సినిమాకు బాగా కనెక్ట్ అయ్యాను. ఆ సినిమా చూసిన తర్వాత దర్శకుడు కల్యాణ్ కృష్ణకు ఫోన్ చేశాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే ఏడ్చేశాను. ఆ సినిమాకు అంత కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే, బంగార్రాజు కాన్సెప్ట్ మా ట్రెడిషన్. మా శెట్టి కుటుంబాల్లో ఓ నమ్మకం ఉంది. మా పెద్దోళ్లు, ఆత్మ రూపంలో మా చుట్టూ ఉంటారు, మమ్మల్ని కాపాడుతుంటారనేది మా వర్గంలో బాగా నమ్ముతాం. వాళ్లకు పూజలు కూడా చేస్తాం. బంగార్రాజు సినిమా చూసినప్పుడు మా పూర్వీకులు, మా సంప్రదాయాలు గుర్తొచ్చాయి. నా మనసులో ఉన్న నమ్మకం తెరపై కనిపించేసరికి ఎమోషనల్ అయ్యాను. అందుకే ఏడ్చేశాను.”

ఇలా తన ఏడుపు వెనక కారణాన్ని బయటపెట్టింది కృతిషెట్టి. తన సినిమాలు తానే చూసి ఏడ్చిన సందర్భం ఇదొక్కటే కాదంట. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసినప్పుడు కూడా ఏడ్చేసిందంట. ఇప్పటివరకు కెరీర్ లో తను నటించిన సినిమాల నుంచి ఈ రెండు మాత్రమే తనను కదిలించాయని చెబుతోంది కృతి.

కస్టడీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ బ్యూటీ.. తన వర్గానికే చెందిన అనుష్క శెట్టి అంటే బాగా ఇష్టమని చెబుతోంది. ఆమె పోషించిన దేవసేన పాత్ర అంటే ఇంకా ఇష్టమంట. అయితే అనుష్కను ఇప్పటివరకు కలవలేదంటోంది.