మహేష్ హాలిడే ట్రిప్ మరింత మెరిసింది

సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్లడం మహేష్ కు అలవాటు. సరదాగా ఓ 10 రోజులు అలా ట్రిప్ కు వెళ్లొస్తుంటారు. అలా ఎన్నో దేశాలు చుట్టేశారు. ఇప్పుడు కూడా మహేష్…

సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్లడం మహేష్ కు అలవాటు. సరదాగా ఓ 10 రోజులు అలా ట్రిప్ కు వెళ్లొస్తుంటారు. అలా ఎన్నో దేశాలు చుట్టేశారు. ఇప్పుడు కూడా మహేష్ అండ్ ఫ్యామిలీ విహార యాత్రలోనే ఉంది. అయితే ఈసారి వాళ్ల విహారం-ఆనందం రెట్టింపు అయింది.

యూరోప్ పర్యటనలో ఉంటుండగానే మహేష్ కొడుకు గౌతమ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించాడు. దీంతో కొడుకు సాధించిన ఘనతను మహేష్ కుటుంబం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. జర్మనీలోని ఓ పెద్ద హోటల్ లో పార్టీ చేసుకుంది.

కొడుకు పాస్ అయిన సందర్భంగా మహేష్, నమ్రత తమ అనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా జర్మనీలో దిగిన ఓ సెల్పీని కూడా వదిలారు. ప్రతి హాలిడే ట్రిప్ లో సితార సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిస్తే, ఈసారి మాత్రం గౌతమ్ హైలెట్ అయ్యాడు.

వన్-నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు గౌతమ్. తండ్రి మహేష్ బాబు టైపులోనే బాలనటుడిగా కెరీర్ కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. కానీ గౌతమ్ కు ఆ అవకాశం ఇవ్వలేదు మహేష్. అతడ్ని పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టేలా చేశాడు. అలా ప్రస్తుతం చదువుపైన దృష్టిపెట్టిన గౌతమ్, ఓ మంచి రోజు చూసి మరోసారి తెరపైకొస్తాడు.