Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్ 'మైండ్ బ్లాక్' చేసేసాడు

మహేష్ 'మైండ్ బ్లాక్' చేసేసాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు-మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సంక్రాంతి పందెం కోడి 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా పాటల పండుగ స్టార్ట్ అయింది. ప్రతి సోమవారం ఓ సాంగ్ అని ప్రకటించినట్లుగానే తొలిసాంగ్ వచ్చేసింది. 

'మైండ్ బ్లాంక్..మైండ్ బ్లాంక్' అంటూ సాగిన అచ్చమైన దేవీశ్రీప్రసాద్ స్టయిల్ పాటను బయటకు వదిలారు. రనినా రెడ్డి మాంచి మెటాలిక్ టోన్ తో పాడిన పాట, మాస్ ను ఓ ఊఫు ఊపేలా వుంది. ఈ పాటలో స్పెషాలిటీ ఏమిటంటే, మహేష్ కూడా అక్కడక్కడ డైలాగుల ద్వారా గొంతు కలపడం.

నువ్వు కొట్టరా..నువ్వు ఊదరా,,నువ్వు వాయించరా..ఇలా మూడు నాలుగు డైలాగులు ఫన్నీగా మహేష్ గొంతుతో వినిపించారు. పాట విషయంలో దేవీ పక్కాగా తన స్టయిల్ సాహిత్యం, తన స్టయిల్ ట్యూన్ నే నమ్ముకున్నాడు. 'ఎపుడూ ప్యాంటేసే వాడు లుంగీ కట్టాడు...అంటూ ఓ దేశీ మాస్ లుక్ ను వర్ణిస్తూ పాటను స్టార్ట్ చేసారు. అక్కడ నుంచి ఒక్కో బిట్ కు ఒక్కో ఇనుస్ట్రుమెంటేషన్ ను వినిపిస్తూ, మాస్ బీట్ ను మాత్రం ఎక్కడా వదలకుండా చూసుకున్నారు.

అనిల్ రావిపూడి-మహేష్ సినిమా మొదట్నించీ మహా మాస్ అని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇప్పుడు ఈ పాట అదే విషయాన్ని మరో చెప్పినట్లు అయింది. మొత్తం మీద అనిల్ రావిపూడి-మహేష్-దేవీ కలిపి సేఫ్ గేమ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?