మహేష్ దూకుడుకు కరోనా బ్రేకులు

ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు సర్కారువారిపాట సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్రారంభించాడు మహేష్ బాబు. ఆ టైమ్ లోనే చాలామంది మహేష్ చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోయారు. కరోనా టైమ్ లో…

ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు సర్కారువారిపాట సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్రారంభించాడు మహేష్ బాబు. ఆ టైమ్ లోనే చాలామంది మహేష్ చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోయారు. కరోనా టైమ్ లో ఈ షూటింగ్ ఏంటని భయపడ్డారు. ఇప్పుడా భయాలన్నీ నిజమయ్యాయి.

కరోనా కారణంగా మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా షూటింగ్ ఆగిపోయింది. మూడు రోజుల కిందట ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాడు మహేష్. అంతలోనే యూనిట్ లో ఆరుగురికి కరోనా సోకింది. దీంతో షూటింగ్ ఆపేసి అంతా ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మహేష్ కూడా హోం క్వారంటైన్ లో ఉన్నాడు.

మహేష్ ప్లాన్స్ ను కరోనా తారుమారుచేసింది. జులై నాటికి సర్కారువారిపాట షూటింగ్ పూర్తిచేసి, ఆగస్ట్ నుంచి త్రివిక్రమ్ తో కలిసి కొత్త సినిమా షురూ చేయాలనుకున్నాడు మహేష్. కానీ సర్కారువారి పాట షెడ్యూల్స్ ఇప్పుడు మరింత ఆలస్యం కాబోతున్నాయి. ఈ షెడ్యూల్ ను మరో ప్రాంతంలో మొదలుపెట్టడం కూడా అసాధ్యం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులున్నాయి.

ఓవైపు ఇలా షూటింగ్స్ అన్నీ ఆగిపోతుంటే, మరోవైపు ఆచార్య షూటింగ్ మాత్రం నడుస్తోంది. తాజాగా రామ్ చరణ్, పూజా హెగ్డేపై  ఓ సాంగ్ షూట్ చేశారు. యూనిట్ లో ఎవ్వరికీ కరోనా సోకకుండా ఉంటే, మరో 3-4 రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది.