Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ మరో రాక్షసుడు-హిడింబ

మళ్లీ మరో రాక్షసుడు-హిడింబ

టీవీ గేమ్ షో ప్రెజెంటర్ ఓంకార్ సోదరుడిగా సినిమాల్లోకి వచ్చాడు హీరో అశ్విన్. కొన్ని సినిమాలు చేసాడు. కానీ ఇప్పటి వరకు కెరీర్ టర్నింగ్ అయితే ఇచ్చుకోలేదు. 

కాస్త గ్యాప్ ఇచ్చి ఓ మాంచి థ్రిల్లర్ తో తన లక్ పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే చేస్తున్న సినిమా ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకుడు. ఎకె పతాకంపై నిర్మాణం. ఈ సినిమా ట్రయిలర్ ను హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసారు.

గతంలో వచ్చిన అనేకానేక థ్రిల్లర్ల మాదిరిగానే వుంది ట్రయిలర్. అనగనగా ఓ సైకో కిల్లర్. వరుస హత్యలు. డీ కోడ్ చేసి, వాడిని పట్టుకోవడానికి హీరో యత్నాలు. ట్రయిలర్ లో సైకో హింస కాస్త ఎక్కువే చూపించారు. కాస్త భయంగానే వుంది చూడడానికి. అందులోనూ ఎర్రరంగు ఫోబియా.. అమ్మాయిలను హింస పెట్టడం, రక్తం ఇవన్నీ పెద్ద తెరపై చూడ్డానికి కాస్త ధైర్యం కావాల్సిందేనేమో.

సైకో థ్రిల్లర్ అన్నంత మాత్రాన ఇంత హింసను ముందే ట్రయిలర్ లోకి తెచ్చేయక్కరలేదేమో? అశ్విన్ కాస్త మేకోవర్ అయినట్లు కనిపిస్తున్నాడు. మేకింగ్ విలువలు బాగున్నాయి. సినిమా ఎలా వుంటుందో చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?