మళ్లీ మరోసారి విడుదల గడబిడ

టాలీవుడ్ లో మళ్లీ మరోసారి విడుదల తేదీల వివాదం వస్తోంది. ఇండస్ట్రీలో ఇటీవల వివాదాస్పదంగా ముందుకు సాగుతున్న కింగ్ పిన్ దిల్ రాజు మరోసారి తన ప్లాన్ కు శ్రీకారం చుడుతున్నారు. తనను కాదని…

టాలీవుడ్ లో మళ్లీ మరోసారి విడుదల తేదీల వివాదం వస్తోంది. ఇండస్ట్రీలో ఇటీవల వివాదాస్పదంగా ముందుకు సాగుతున్న కింగ్ పిన్ దిల్ రాజు మరోసారి తన ప్లాన్ కు శ్రీకారం చుడుతున్నారు. తనను కాదని సినిమాలు విడుదల చేసే నిర్మాతలను ఓ చూపు చూడాలనే ఆయన అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 17న తన సినిమా శాకుంతలం విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించినట్లు బోగట్టా.

అయితే ఇందులో ఏం వివాదం వుంది అని అంటే అనుకోవచ్చు. కానీ ఆ తేదీకి ఇప్పటికే మూడు సినిమాలు ప్రకటించేసి వున్నారు. ఒకటి సితార సంస్థ నిర్మించిన ‘సర్’ సినిమా. థనుష్ హీరో. వెంకీ అట్లూరి దర్శకుడు. రెండో సినిమా విష్వక్ సేన్ ‘ధమ్కీ’. దీనికి దర్శకుడు..నిర్మాత రెండూ విష్వక్ సేన్ నే. మూడో సినిమా గీతా సంస్థ నిర్మించిన ‘వినరో భాగ్వము విష్ణు కథ’ బన్నీ వాస్ నిర్మాత.

ఇలా కీలకమైన మూడు సినిమాలు వుండగా, అది కూడా ఎప్పుడో డేట్ లు వేసేసిన తరువాత ఇప్పుడు దిల్ రాజు తన సినిమా డేట్ ప్రకటిస్తుండడం విశేషం. పై మూడు సినిమాలు కూడా దిల్ రాజు పంపిణీ కాకపోవడం ఇక్కడ గమనార్హం. 

అంటే కావాలనే దిల్ రాజు తన సినిమాను ఈ డేట్ కు వేస్తున్నారు అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇండస్ట్రీ ఇప్పుడు దిల్ రాజు-యాంటీ దిల్ రాజు అనే రెండు గ్రూపులుగా విడిపోతున్నట్లు కనిపిస్తోంది.