Advertisement

Advertisement


Home > Movies - Movie News

మనోజ్ కు గుడ్ బై చెప్పేసాడు

మనోజ్ కు గుడ్ బై చెప్పేసాడు

మంచు మనోజ్ ఒక విలక్షణ పర్సనాలిటీ. మంచు ఫ్యామిలీలో ఆడ్ వన్ అవుట్ అని అంటారు అంతా. గత కొంత కాలంగా మనోజ్ ఎక్కడ వుంటున్నాడో, ఏం చేస్తున్నాడో అంతా సస్సెన్స్ నే. 

అంతకు ముందు అహం బ్రహ్మాస్మీ అనే సినిమా స్టార్ట్ చేసి హడావుడి చేసాడు. ఆ హడావుడికి ముందు కూడా కొన్నాళ్లు గాయబ్. మధ్యలో ఓసారి తెలంగాణలో ఒక టూరిజం ప్రాజెక్ట్ కోసం ట్రయ్ చేసాడు. అలాగే జగన్ ను వెళ్లి కలిసి వచ్చాడు. ఎక్కువగా చెన్నయ్ లో వుంటున్నాడని టాక్. 

ఇటీవల మళ్లీ ఒక్కసారిగా మనోజ్ సన్నబడే ప్రయత్నం చేస్తున్నాడని, అహాం బ్రహ్మస్మి ప్రాజెక్టు పూర్తి చేస్తాడని, మరో ప్రాజెక్ట్ కూడా కొత్త స్వంత బ్యానర్ మీద చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

ఆ వార్తలు అన్నీ ఎప్పటికి నిజం అవుతాయో అన్న సంగతి అలా వుంచితే అహాం బ్రహ్మస్మి సినిమా డైరక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాత్రం పక్కకు తప్పుకున్నాడు. ఇక ఆ ప్రాజెక్ట్ చేయడం, ఆ ప్రాజెక్ట్ మీద వుండడం తన వల్ల కాదని చెప్పేసినట్లు తెలుస్తోంది. 

అక్కడ నుంచి జంప్ చేసి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా స్టార్ట్ చేసేసాడు. సినిమా ఓపెనింగ్ విడియో కూడా వచ్చింది. ఆ విడియోలో డైలాగులు వింటుంటే కొంపదీసి అహాం బ్రహ్మాస్మీ ప్రాజెక్టునే ఇటు షిప్ట్ చేసేసాడా అన్న అనుమానం కలుగుతోంది. 

అస్సలు హీరోల కోసం టాలీవుడ్ వెంపర్లాడిపోతోంది. రాజ్ తరుణ్, శ్రీ విష్ణు దగ్గర నుంచి ఏ హీరో కూడా ఖాళీగా లేరు. కానీ మంచు హీరోల దగ్గరకు మాత్రం వేరే నిర్మాతలు ఎందుకు వెళ్లడం లేదో? వాళ్లకే తెలియాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?