ఈమె శాకాహారుల్లో సెక్సీ

హీరోయిన్లలో చాలామంది నాన్-వెజిటేరియన్లుగా మారారు. అలాంటి వాళ్లను ఎప్పటికప్పుడు పెటా గుర్తిస్తూ వస్తోంది కూడా. అయితే ఈసారి మాత్రం పెటా లిస్ట్ లో స్టార్ హీరోయిన్లు ఎవరూ చోటు సంపాదించుకోలేకపోయారు. ఆశ్చర్యకరంగా మానుషి ఛిల్లర్…

హీరోయిన్లలో చాలామంది నాన్-వెజిటేరియన్లుగా మారారు. అలాంటి వాళ్లను ఎప్పటికప్పుడు పెటా గుర్తిస్తూ వస్తోంది కూడా. అయితే ఈసారి మాత్రం పెటా లిస్ట్ లో స్టార్ హీరోయిన్లు ఎవరూ చోటు సంపాదించుకోలేకపోయారు. ఆశ్చర్యకరంగా మానుషి ఛిల్లర్ పెటా లిస్ట్ లో సెక్సీ స్టార్ గా అవతరించింది.

నిజానికి బాలీవుడ్ లో ఈమెకు పెద్దగా పాపులారిటీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అక్షయ్ కుమార్ హీరోగా రాబోతున్న ఫృధ్వీరాజ్ అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. సినిమాల్లేకపోయినా, సోషల్ మీడియాలో మానుషి చాలా పాపులర్.

2017 మిస్ వరల్డ్ గా అవతరించినప్పట్నుంచి ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ తర్వాత ఆమె బికినీ ఫొటోస్ కూడా యమ పాపులర్ అయ్యాయి. వీటికి తోడు ఆమె శాకాహారి కావడంతో పెటా ఎక్కువగా ప్రమోట్ చేసింది. తను వెజిటేరియన్ గా మారలేదని, పుట్టుక నుంచే శాకాహారినని అంటోంది మానుషి.

“వెజిటేరియల్ గా ఉండడమే నా జీవితం. నా తల్లిదండ్రులు శాకాహారులు. సహజంగా అదే పద్ధతి నాక్కూడా వచ్చింది. ఏదో మిస్సయిన భావన నాకు ఎప్పుడూ కలగలేదు. పైగా ఆరోగ్యానికి ఇది చాలామంచిది కదా.”

రెండేళ్ల పాటు ఎండోర్స్ మెంట్స్ తో బిజీగా ఉన్న మానుషి, ఇకపై తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ అని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై 3 సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.