Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా చిచ్చు రగిలింది

మెగా చిచ్చు రగిలింది

మెగా ఫ్యాన్స్ మీటింగ్ వికటిస్తున్నట్లు కనిపిస్తోంది. మెగా హీరోల ఫ్యాన్స్ అందరినీ ఓ తాటి మీదకు తీసుకువచ్చి, మెగాస్టార్ సినిమాలకు, జనసేన పార్టీకి దన్నుగా మార్చాలని పన్నిన వ్యూహం పూర్తిగా వికటించినట్లు కనిపిస్తోంది. 

చిరు,పవన్, చరణ్ లను మాత్రమే మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా, బన్నీ కాదన్నట్లుగా ఈ సమావెేశం కలరింగ్ ఇవ్వడంతో వచ్చింది సమస్య. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో నానా యాగీ చేస్తున్నారు. ‘ఏమీ పీకలేరు బ్రదర్’ హ్యాష్ ట్యాగ్ ను లక్షల్లో ట్రెండింగ్ చేసారు.

ఇదంతా మెగా మీట్ లో ఓ అభిమాని కమ్ అభిమానుల సంఘ ఆఫీస్ బేరర్ మాట్లాడిన ప్రసంగం వల్ల వచ్చింది. మెగా మీట్ లో ఓ ఆఫీస్ బేరర్ మాట్లాడుతూ బన్నీకి కృతజ్ఙత లేదని, మెగాస్టార్ బ్యాక్ గ్రవుండ్ వల్లనే ఈ స్టేజ్ కు వచ్చిన సంగతి మరచిపోయారని, ఇక మెగాభిమానులు ఎవ్వరూ బన్నీ పల్లకీ మోయాల్సిన పని లేదని పేర్కొంటూ ప్రసంగించారు. అది కాస్తా బయటకు వచ్చింది.

దాంతో బన్నీ ఫ్యాన్స్ మెగాఫ్యాన్స్ ను ఉద్దేశించి ‘ఏం పీకలేరు బ్రదర్’ అనే హ్యాష్ టాగ్ ను ట్రెండింగ్ చేసారు. అది ఇప్పటికి 1,03,000 ట్వీట్లతో ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతే కాదు, ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తి మరణించినట్లు ఫొటోలు వేసి ప్రచారం సాగిస్తున్నారు.

పాపం, ఆచార్యకు సరైన ఓపెనింగ్ పడలేదు. రాబోయే సినిమాల పరిస్థితి తెలియదు. అందుకోసం ఫ్యాన్స్ ను ఏకతాటిపైకి తెద్దామనుకున్నారు. అలాగే పవన్ జనసేనకు తమ మద్దతు వుందని చెప్పాలనుకున్నారు. ఇవన్నీ ఇలా వికటిస్తాయని అనుకుని వుండరు. 

ఓ అభిమానుల సమావేశంలోనే ఇన్ని లుకలుకలు బయటపడి, అభిమానులు ఇన్ని చీలికలైతే, ఇక జనసేనకు వీరంతా కలిసి ఒరగబెట్టేది ఏముంటుంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?