బుద్ధి లేదా మీకు.. మీడియాపై మోహన్ బాబు ఫైర్

మోహన్ బాబు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మీడియాపై తన కోపం ప్రదర్శించారు. బుద్ధి లేదా అంటూ గదమాయించారు. ఉద్యోగాలు తీయించేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. లోగోలు లాక్కోమంటూ తన అనుచరుల్ని…

మోహన్ బాబు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మీడియాపై తన కోపం ప్రదర్శించారు. బుద్ధి లేదా అంటూ గదమాయించారు. ఉద్యోగాలు తీయించేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. లోగోలు లాక్కోమంటూ తన అనుచరుల్ని ఆదేశించారు. షాద్ నగర్ లో నడిచింది ఈ హంగామా అంతా.

హైదరాబాద్ లో ఉండే మోహన్ బాబు ఉన్నఫలంగా షాద్ నగర్ ఎందుకెళ్లారు? ఆయనకు అక్కడ కొన్ని ఆస్తులున్నాయి. కొన్ని ల్యాండ్స్ తో పాటు ఫామ్ హౌజ్ లు ఉన్నట్టు సమాచారం. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసం ఆయన షాద్ నగర్ వెళ్లారు. మోహన్ బాబు వస్తున్నారనే విషయం మీడియాకు తెలిసింది.

వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర మీడియా కాపుకాసింది. మోహన్ బాబు వచ్చిన వెంటనే తమ కెమెరాలకు పనిపెట్టింది. ఇది మోహన్ బాబు ఊహించలేదు. చడీచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ముగించుకొని, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలనుకున్నారు మోహన్ బాబు.

సడెన్ గా మీడియాను చూసేసరికి ఆయనకు కోపం వచ్చినట్టుంది. వెంటనే మీడియా ప్రతినిధులపై నోరుపారేసుకున్నారు. అయితే ఆయన కోపానికి కారణం వేరే ఉందనేది ఇన్ సైడ్ టాక్.

మోహన్ బాబు కుటుంబంలో ఈమధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య అభిప్రాయబేధాలున్నాయి. అవి ఆస్తి పంపకాల వరకు దారితీశాయని సమాచారం. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ పని మీద మోహన్ బాబు, షాద్ నగర్ వచ్చినట్టు తెలుస్తోంది.