Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒకటి కాదు.. రెండు కాదు.. 4 సినిమాలు

ఒకటి కాదు.. రెండు కాదు.. 4 సినిమాలు

ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరో సినిమా చేస్తారు. మహా అయితే 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా చేస్తారు. కానీ నాగశౌర్య మాత్రం ఒకేసారి 4 సినిమాలు ఓకే చేశాడు. అవును.. ఇప్పటికే 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు మరో సినిమా కూడా ఓకే చేశాడు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ మూవీ చేయబోతున్నాడు శౌర్య. దీనికి సంబంధించి కొద్దిసేపటి కిందట అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. గతంలో నాగచైతన్యతో సినిమా అంటూ ఈమె పేరు వార్తల్లోకెక్కింది. ఇప్పుడు కూడా అదే కథ, అవిడే డైరక్టర్. కాకపోతే హీరో మాత్రం నాగచైతన్య కాదు, నాగశౌర్య.

ప్రస్తుతం రమణతేజ దర్శకత్వంలో సొంత బ్యానర్ పై అశ్వద్ధామ అనే సినిమా చేస్తున్నాడు శౌర్య. ఈ మూవీతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి అనే టైటిల్ తో మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇక సుబ్రమణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో పార్థు అనే సినిమాకు చాన్నాళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు వీటికి తోడు లక్ష్మీసౌజన్య సినిమా ఒకటి.

వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా మే నెలలో సినిమాను రిలీజ్ చేస్తారు. అంటే.. సంతోష్ జాగర్లపూడి సినిమా మరింత ఆలస్యమౌతుందన్నమాట. 

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?