మొన్నటివరకు రానా, ఇప్పుడు నాగచైతన్య?

కోలీవుడ్ లో పెద్ద హిట్టయింది మానాడు సినిమా. శింబు హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడీ రీమేక్ లో నటించే హీరో ఎవరనే…

కోలీవుడ్ లో పెద్ద హిట్టయింది మానాడు సినిమా. శింబు హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడీ రీమేక్ లో నటించే హీరో ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. మొన్నటివరకు రానా పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు రానా స్థానంలో నాగచైతన్య పేరు వినిపిస్తోంది.

టైమ్ లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మానాడు సినిమా రీమేక్ రైట్స్ (అన్ని భారతీయ భాషలతో కలుపుకొని) తో పాటు తెలుగు డబ్బింగ్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. సురేష్ బాబు ఏ రైట్స్ తీసుకున్నా, ఆ సినిమాను ఒరిజినల్ దర్శకుడితోనే నిర్మించాలని చూస్తారు. 

మానాడు తెలుగు రీమేక్ కోసం కూడా దర్శకుడు వెంకట్ ప్రభును ప్రయత్నిస్తున్నారు. వెంకట్ ప్రభు ఓకే అన్న తర్వాత అప్పుడు హీరో ఎవరనే విషయాన్ని ప్రకటించబోతున్నారు సురేష్ బాబు.

రీసెంట్ గా బంగార్రాజు సినిమాలో నటించాడు నాగచైతన్య. ఆ సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడీ రీమేక్ ప్రాజెక్టుతో యాక్షన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టుంది. ఇంతకుముందు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకీ మామ సినిమా చేశాడు చైతూ. మానాడు రీమేక్ ఓకే అయితే, నాగచైతన్యకు సురేష్ ప్రొడక్షన్స్ లో ఇది రెండో సినిమా అవుతుంది.

అటు సురేష్ బాబు మాత్రం ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన శాకిని-డాకినీ అనే రీమేక్ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్నారు. రెజీనా, నివేత థామస్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే మానాడు రీమేక్ పై ఓ స్పష్టత వచ్చేలా ఉంది.