‘నాలుగు స్థంభాలాట’ ఇప్పుడే కాదు

అనిల్ రావిపూడి కథతో నక్కిన త్రినాధరావు ప్లాన్ చేస్తున్న సినిమా నాలుగు స్తంభాలాట అంటూ, ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే లేటేస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా అప్పుడే…

అనిల్ రావిపూడి కథతో నక్కిన త్రినాధరావు ప్లాన్ చేస్తున్న సినిమా నాలుగు స్తంభాలాట అంటూ, ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే లేటేస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా అప్పుడే సెట్ మీదకు వెళ్లడం లేదు. పాపం, దర్శకుడు నక్కిన త్రినాధరావు సినిమా చేసి చాన్నాళ్లయింది. ఈ హీరో, ఆ నిర్మాత అంటూ ఆయన నాలుగు స్తంభాలాట ఆడేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అయింది అనుకుంటే, దీనికి ఇద్దరు హీరోలు అవసరం పడడంతో, ఇదీ లేట్ అయ్యేలా కనిపిస్తోంది.

నిర్మాత దిల్ రాజు ఆలోచనలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో చేస్తే బాగుండును అని అని తెలుస్తోంది. కానీ వరుణ్ తేజ్ డేట్ లు ఇప్పట్లో దొరికే అవకాశం లేదు. దిల్ రాజు ఎఫ్ 3 కూడా వరుణ్ పూర్తి చేయాల్సి వుంది. అందువల్ల ఈ కాంబినేషన్ అంత వీజీ కాదు. 

రవితేజ తో కథ ఓకె చేయించుకుని వున్నారు నక్కిన. కానీ అక్కడ కూడా ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. ఇక్కడా ప్రాజెక్టు వుంది. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. నక్కిన త్రినాధరావు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి?

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు