Advertisement

Advertisement


Home > Movies - Movie News

షాకింగ్.. డ్రగ్స్ కేసులో తెరపైకి నమ్రత పేరు

షాకింగ్.. డ్రగ్స్ కేసులో తెరపైకి నమ్రత పేరు

సుశాంత్ మృతి కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న తర్వాత ఊహించని పేర్లు తెరపైకి వచ్చాయి. నిన్నటికి నిన్న దీపికా పదుకోన్ పేరు వార్తల్లో నిలవగా.. ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మాజీ హీరోయిన్, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు వార్తల్లోకి రావడం సంచలనంగా మారింది.

నిజానికి నమ్రతా సినిమాలు మానేసి చాన్నాళ్లయింది. దాదాపు 15 ఏళ్ల కిందటే ఆమె సినిమాల్లో నటించడం మానేసింది. పైగా ఆమె పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు రావడం నిజంగా ఆశ్చర్యకరం. ఇండియాటుడే న్యూస్ ఛానెల్ ఈ మేరకు నమ్రతపై కథనాన్ని ప్రసారం చేసింది.

డ్రగ్స్ దర్యాప్తులో భాగంగా రియాతో పాటు పలువురు మేనేజర్లు, ఈవెంట్ ఆర్గనైజర్ల వాట్సాప్ ఛాట్స్ ను డీకోడ్ చేసే పనిలోపడ్డారు అధికారులు. ఇందులో భాగంగా D అంటే దీపికా పదుకోన్ అని, S అంటే సారా అలీఖాన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే N అంటే నమ్రత అంటూ ప్రచారం సాగుతోంది.

"నాకు నిజంగా బ్రేక్ కావాలి. బాంబేలో మంచి MD ఇస్తావని ప్రామిస్ చేశావ్ మనం కలిసి పార్టీ చేసుకుందాం నేను తర్వాత రావాలా"

ఈ వాట్సాప్ ఛాట్ కు నమ్రతను లింక్ చేస్తూ నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. సుశాంత్ సింగ్ మేనేజర్ జయ సాహా, నమ్రత మధ్య ఈ వాట్సాప్ ఛాట్ జరిగినట్టు సదరు ఛానెల్ చెప్పుకొస్తోంది. జయ సహాను ఇప్పటికే ఎన్సీబీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కథనం వచ్చింది.

మరోవైపు ఇదే కేసుకు సంబంధించి హీరోయిన్ దియా మీర్జా పేరు కూడా తెరపైకొచ్చింది. గతేడాది జరిగిన ఓ పార్టీలో దియా కూడా డ్రగ్స్ సేవించినట్టు కథనాలు వచ్చాయి. తనపై స్టోరీలు  వచ్చిన వెంటనే దియా రియాక్ట్ అయింది. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోవడం లేదా సరఫరా చేయడం లాంటివి చేయలేదని ఆమె ట్వీట్ చేసింది. 

చంద్రబాబు రాజకీయ జీవితంలో రెండో తప్పు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?