సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు తన కవల పిల్లల పేర్లను రివీల్ చేసింది. ఓ అవార్డ్ ప్రధానోత్సవంలో పాల్గొన్న నయనతారకు తన పిల్లల పేర్లు చెప్పాలని హోస్ట్ అడగడంతో.. ఇన్నాళ్లు బయటపెట్టని తన పిల్లల ఫుల్ నేమ్స్ చెప్పేసింది.
తన పేరుతో పాటు తన భర్త పేరును కలిసే విధంగా విభిన్నమైన పేర్లతో నయనతార వారికి పేర్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. తన మొదటి కుమారుడి పేరు ఉయర్ రుద్రోనిల్ ఎన్ శివన్ అని.. రెండవ కుమారుడి పేరు ఉలాగ్ ధైవాగ్ ఎన్ శివన్ అంటూ క్యూట్గా చెప్పేసింది. ఇంతవరకు పిల్లల పూర్తి ఫోటోలను షేర్ చేయని నయనతార వారి పేర్లను షేర్ చేయడంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే నయన్ తన పిల్లల ఫేస్ కూడా రివీల్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా గత ఏడాది తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. అప్పట్లో చట్టానికి విరుద్ధంగా సరోగసి పద్దతితో పిల్లల్ని కన్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం చట్టానికి లోబడే వారు సరోగసితో పిల్లల్ని కన్నారంటూ పేర్కోనడంతో ఆ వివాదం ముగిసింది.