మరో ఇద్దరు నటులకు కరోనా

బాలీవుడ్ ను కరోనా పట్టిపీడిస్తోంది. కొందరికి ఇలా తగ్గుతుందో లేదో మరికొందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. రణబీర్, అలియాభట్, విక్కీ కౌశల్, కత్రినాకైఫ్, భూమి పడ్నేకర్ లాంటి తారలు కరోనా నుంచి తాజాగా…

బాలీవుడ్ ను కరోనా పట్టిపీడిస్తోంది. కొందరికి ఇలా తగ్గుతుందో లేదో మరికొందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. రణబీర్, అలియాభట్, విక్కీ కౌశల్, కత్రినాకైఫ్, భూమి పడ్నేకర్ లాంటి తారలు కరోనా నుంచి తాజాగా కోలుకోగా.. ఈసారి అర్జున్ రాంపాల్, నీల్ నితిన్ ముకేష్ లాంటి నటులు కరోనా బారినపడ్డారు.

తనకు కరోనా సోకినట్టు అర్జున్ రాంపాల్ ప్రకటించాడు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని తెలిపాడు. ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్న ఈ నటుడు.. అందరూ కలిసి కరోనాను తరిమేయాలని పిలుపునిచ్చాడు.

మరో నటుడు నీల్ నితిన్ ముకేష్ కూడా కరోనా సోకిన విషయాన్ని ధృవీకరించాడు. కొన్ని రోజులుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఎక్కువ భాగం ఇంట్లోనే ఉన్నప్పటికీ తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని వాపోయాడు ఈ నటుడు. ప్రస్తుతం అంతా హోమ్ క్వారంటైన్ లో ఉన్నామన్నాడు.

నిన్నటికినిన్న నటుడు సోనూ సూద్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ప్రకటించాడు. తనకు పాజిటివ్ వచ్చినప్పటికీ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని కూడా స్పష్టంచేశాడు.

గతేడాదితో పోలిస్తే ఈసారి బాలీవుడ్ ను కరోనా ఇంకాస్త గట్టిగా తాకింది. నటీనటులతో పాటు టెక్నీషియన్స్ చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి.