Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆపద్భాంధవుడు ఎందుకు ఆడలేదో?

ఆపద్భాంధవుడు ఎందుకు ఆడలేదో?

తెలుగులో గుర్తుంచుకోదగ్గ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా మారి శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో తొలి చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. శ్రీ‌జ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` అని పేరు ఖ‌రారు చేశారు. ఈ చిత్ర లోగోను ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రంతో జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ శిష్యులు వంశీ, ల‌క్ష్మీనారాయ‌ణ ద‌ర్శకులుగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గొప్ప గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా వుంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వ‌చ్చాయి. వారి సినిమాల్లో  'ఆప‌ద్భాంథ‌వు'డు సినిమా చాలా ఇష్టం. నేను చ‌దువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడ‌లేద‌ని చాలా కోపం వ‌చ్చింది. ఎందుకు ఆడ‌లేదో ఆర్థంకాలేదు. 

అనుదీప్ క‌థ‌, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫ‌న్ వుంటుంది. జాతిర‌త్నాలు హిట్ త‌ర్వాత త‌న స్వార్థం చూసుకోకుండా త‌న తోటివారిని ఎంక‌రేజ్ చేయ‌డం నాకు గ‌ర్వంగా వుంది. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` పోస్టర్ ఒక్కటే చూసాను. దర్శకుడు వంశీది చాలా యునిక్ జోన్ అఫ్ కామెడీ. కథ గురించి చిన్న లైన్ చెప్పాడు. దానికే రెండు నిమిషాలు నవ్వుకున్నా. సినిమా ఎలా వుంటుందో అనే ఎక్సయిట్మెంట్ వుంది. జాతిరత్నాలు కంటే పెద్ద హిట్ కావాలి'' అని కోరుకున్నారు. 

జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ మాట్లాడుతూ, జాతిర‌త్నాల‌కు వంశీ ప‌నిచేశాడు. ఓసారి ఏదైనా క‌థ వుందా అని అడిగాడు. అప్పుడే క‌థ రాశాను. శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో వ‌స్తున్న ఈ సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా అవుతుంది. ర‌థ‌న్ మంచి సంగీతం స‌మ‌కూర్చారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టైటిల్ గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లో తెలియ‌జేస్తాను అన్నారు.

ఏడిద శ్రీ‌రామ్ మాట్లాడుతూ, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నుంచి మంచి సినిమాలు వ‌చ్చాయి. అలా మంచి సినిమాలు చేయాల‌ని నా కుమార్తె శ్రీ‌జ ఎనిమిది సంవ‌త్సరాలుగా అంటుండేది. మా ఫ్యామిలీ వెల్ విష‌ర్ అల్లు అర‌వింద్‌గారిని క‌లిశాం. యూత్ రావాల‌ని ప్రోత్సహించారు. జాతిర‌త్నాలు సినిమా మాకు బాగా న‌చ్చింది. అనుదీప్ అసిస్టెంట్‌లు వంశీ, ల‌క్ష్మీనారాయ‌ణ‌ల‌ను ద‌ర్శకులుగా ప‌రిచ‌యం చేసేలా అవ‌కాశం క‌ల్పించారు. 

నిర్మాత శ్రీ‌జ చిత్ర ద‌ర్శకుడు వంశీ, మ‌రో ద‌ర్శకుడు ల‌క్ష్మీనారాయ‌ణ తదితరులు ప్రసంగించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?