న‌టి మూడో పెళ్లిలో కొత్త ట్విస్ట్‌

ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌ని ఎన్నో క‌ల‌లు కంటున్న న‌టి వనిత‌కు చికాకులు త‌ప్ప‌డం లేదు. సీనియ‌ర్ న‌టులు మంజుల‌-విజ‌య్ కుమార్ దంప‌తుల పెద్ద కుమార్తె వ‌నిత విజ‌య్ కుమార్…

ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌ని ఎన్నో క‌ల‌లు కంటున్న న‌టి వనిత‌కు చికాకులు త‌ప్ప‌డం లేదు. సీనియ‌ర్ న‌టులు మంజుల‌-విజ‌య్ కుమార్ దంప‌తుల పెద్ద కుమార్తె వ‌నిత విజ‌య్ కుమార్ ఈ నెల 27న మూడో పెళ్లి చేసుకోవ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

వ‌నిత 2000వ సంవ‌త్స‌రంలో న‌టుడు ఆకాశ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అనంత‌రం దంప‌తుల మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర్లేదు. దీంతో విడాకుల బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు. 2005లో వ‌న‌తి, ఆకాశ్ దంప‌తులు విడిపోయారు. అనంత‌రం 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు. వీరి సంసారం కూడా ఎంతో కాలం స‌జావుగా సాగ‌లేదు.  

అత‌నితో కూడా విడిపోయారామె. ఈ నేప‌థ్యంలో కొంత కాలంగా  న‌టుడు పీటర్ పాల్‌తో వ‌నిత డేటింగ్‌లో ఉంటూ…ఈ నెల 27న మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. వ‌నిత పెద్ద కూతురు కూడా త‌ల్లి నిర్ణ‌యానికి  మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఇదిలా ఉంటే తాజాగా కొత్త వివాదం తెర‌పైకి వ‌చ్చింది. వనిత-పీటర్ పాల్ జంటపై పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డం…వ‌నిత మూడో పెళ్లిలో అనుకోని ట్విస్ట్‌. తనతో విడాకులు తీసుకోకుండానే పీటర్  ఇంకో పెళ్లి చేసుకున్నాడ‌ని ఆమె ఫిర్యాదు సారాంశం. మ‌రి ఇది ఏ మ‌లుపు తిరుగుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి ఉంది. 

ఐదుసార్లు ట్రైచేసి నావల్లకాక వదిలేసాను

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్