3 పాఠాలు నేర్చుకున్నాను – నిహారిక

డ్రగ్స్ పబ్ కేసులో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డ మెగా డాటర్ కొణెదల నిహారిక, అప్పట్లో పూర్తిగా సోషల్ మీడియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. హెయిర్…

డ్రగ్స్ పబ్ కేసులో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డ మెగా డాటర్ కొణెదల నిహారిక, అప్పట్లో పూర్తిగా సోషల్ మీడియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. హెయిర్ స్టయిల్ మార్చి, న్యూ లుక్ తో మరోసారి సోషల్ మీడియాలోకి ఎంటరైన ఈ మాజీ హీరోయిన్, గడిచిన 8 వారాల్లో 3 పాఠాలు నేర్చుకున్నట్టు ప్రకటించింది.

“ఇనస్టాగ్రామ్ నుంచి బ్రేక్ తీసుకున్న ఈ 8 వారాల గ్యాప్ లో 3 పాఠాలు నేర్చుకున్నాను. 1. ప్రపంచం అంతం అవ్వదు. 2. ఇతరులు ఏం చేస్తున్నారనేది నేను పట్టించుకోను. 3. ఇప్పుడు రీఫ్రెష్ అయ్యాను, పోస్టులు పెట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”

ఇలా ఈ 2 నెలల గ్యాప్ లో 3 పాఠాలు నేర్చుకున్నానంటూ పోస్ట్ పెట్టింది నిహారిక. దీనిపై సోషల్ మీడియా జనాలు ఒక్కో రకంగా ఫీల్ రియాక్ట్ అవుతున్నారు. హెయిర్ స్టయిల్ మారిస్తే, రీఫ్రెష్ అయిపోతామా అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు మాత్రం ఆమెను ఇనస్టాలోకి సాదరంగా స్వాగతిస్తూ పోస్టులు పెడుతున్నారు.

నిహారిక పార్టీకి వెళ్లిన పబ్ లో డ్రగ్స్ బయటపడిన సంగతి తెలిసిందే. ఆ రైడ్ లో నిహారికను స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు, తర్వాత కొద్దిసేపటికి ఆమెను విడిచిపెట్టారు. ఆ కేసుకు సంబంధించి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో నిహారిక పేరును కూడా చేర్చారు. ఆ ఘటన తర్వాత మీడియాకు, సోషల్ మీడియాకు దూరమైన నిహారిక ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.

తన భర్తతో కలిసి ఓటీటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేసే పనిలో ప్రస్తుతం నిహారిక బిజీగా ఉంది. దీని కోసం ఆమె సొంతంగా ఆఫీస్ కూడా తెరిచింది. ఈమధ్యే నిర్మాతగా మరో ప్రాజెక్టు మొదలుపెట్టింది.