అందాల కిరీటం దిశగా రాజశేఖర్ కూతురు!

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ముంబయిలో నిర్వహించిన ఆడిషన్స్ లో ఆమె ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీలో నిలిచింది.…

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ముంబయిలో నిర్వహించిన ఆడిషన్స్ లో ఆమె ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీలో నిలిచింది. 3 రోజుల పాటు జరిగిన ఆడిషన్స్ లో ఇండియా మొత్తం మీద టాప్-31 ఫైనలిస్టులను ఎంపిక చేశారు.

ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది శివానీ. తమిళనాడు నుంచి ఆమెకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ 31 మంది, మిస్ ఇండియా-2022 కిరీటానికి పోటీ పడతారు. మిస్ ఇండియా పోటీల్లో, మిస్ తమిళనాడు-2022 హోదాలో ఆమె పాల్గొంటుంది. ఈ విజయంతో ఆమె మిస్ ఇండియా కిరీటానికి మరో అడుగు దగ్గరగా వెళ్లినట్టయింది.

మిస్ ఇండియా పోటీల కోసం కొన్ని నెలలుగా ప్రివేర్ అవుతోంది శివానీ. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు అందాల పోటీలకు సన్నద్ధం అవుతోంది. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. ఆమెకు టాప్-31 లిస్ట్ లో చోటు దక్కింది.

అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటి సినిమాల్లో నటించింది శివానీ. తండ్రి రాజశేఖర్ తో కలిసి శేఖర్ అనే సినిమా కూడా చేసింది. ప్రస్తుతం చేతిలో 2 సినిమాలున్నాయి. వీటితో పాటు ఓ వెబ్ డ్రామాలో కూడా నటిస్తోంది.