ఎన్టీఆర్ తో సైఫ్ ఆలీఖాన్ ఢీ!

ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలే. హీరోలు మనవాళ్లు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్ లు మాత్రం అన్ని భాషల వాళ్లని కలిపి పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా మార్చాలి. దాదాపు అన్ని…

ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలే. హీరోలు మనవాళ్లు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్ లు మాత్రం అన్ని భాషల వాళ్లని కలిపి పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా మార్చాలి. దాదాపు అన్ని సినిమాలకు ఇదెే స్కీమ్ రన్ అవుతోంది. 

దర్శకుడు కొరటాల శివ ఈ స్కీమును ఏనాడో మొదలుపెట్టారు. లేటెస్ట్ గా తను ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకు కూడా ఇదే చేయబోతున్నారు. ఎన్టీఆర్ ఢీ కొట్టే విలన్ గా హిందీ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే జాన్వి హైదరాబాద్ వచ్చింది. ఫొటో షూట్ కూడా జ‌రిగిపోయింది.

సినిమా కథ మాఫియా బ్యాక్ డ్రాప్ లో, అది కూడా ముంబాయి నేపథ్యంలో వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బలమైన విలన్ కావాలి. పైగా ముంబాయి నేపథ్యం అని అన్నపుడు బాలీవుడ్ నేపథ్యం వుంటే ఇంకా మంచింది. అందుకే సైఫ్ ఆలీఖాన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సైఫ్ కనుక ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా పాన్ ఇండియా లుక్ వస్తుంది. అటు జాహ్నవి..ఇటు సైఫ్ తో పాటు మరికొంత మంది ఇతర భాషా నటులు కూడా వుంటారట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అని ఇప్పటికే వినిపిస్తోంది. ఈ నెల 24న అన్నపూర్ణ స్టూడియోలో భారీగా పూజ జ‌రుపుకుని వచ్చే నెల 20 నుంచి సెట్ మీదకు వెళ్తుందీ సినిమా.