ఎన్టీఆర్-త్రివిక్రమ్-అంతా ఓకె!

అరవింద సమేత తరువాత మళ్లీ మరోసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వస్తోంది అని ఫ్యాన్స్ సంబరపడినంత సేపు పట్టలేదు ఆ సినిమా క్యాన్సిల్ అయిపోవడానికి. దీనికి ఎవరి కారణాలు వాళ్లు రాసుకున్నారు. చెప్పుకున్నారు.  Advertisement కానీ…

అరవింద సమేత తరువాత మళ్లీ మరోసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వస్తోంది అని ఫ్యాన్స్ సంబరపడినంత సేపు పట్టలేదు ఆ సినిమా క్యాన్సిల్ అయిపోవడానికి. దీనికి ఎవరి కారణాలు వాళ్లు రాసుకున్నారు. చెప్పుకున్నారు. 

కానీ అసలు విషయం వేరు. మైత్రీ కి తిరిగి ఇచ్చిన త్రివిక్రమ్ అడ్వాన్స్ మొత్తాన్ని ఈ సినిమా ప్రాజెక్ట్ వ్యయంలో కలపడం దగ్గర వచ్చింది సమస్య. సినిమా నిర్మాణంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా భాగస్వామి కావడంతో ఈ పాయింట్ అంగీకారం కాలేదు. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోయి లాభం తగ్గిపోతుంది. ఈ ఎకనామిక్స్ అంతా వేరే సంగతి. మొత్తం మీద ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోయింది.

అప్పటి నుంచి ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఇక దూరమే అన్నట్లు అనుకున్నారంతా. త్రివిక్రమ్ కూడా మహేష్ దగ్గరకు చేరిపోయారు. తరువాత సినిమా బన్నీతో ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాల దిశగా వడివడిగా అడుగేస్తున్నారు. కానీ త్రివిక్రమ్ మదిలో ఓ భారీ మైథలాజికల్ సినిమా వుంది. ఎన్టీఆర్ లేకుండా తెలుగు మైథలాజికల్ సినిమా అంటే కాస్త అనుమానించాల్సిన విషయమే.

నిన్నటికి నిన్న ఎన్టీఆర్ ఇచ్చిన హై లెవెల్ పార్టీకి త్రివిక్రమ్ హాజరయ్యారు. త్రివిక్రమ్ తో పాటు హారిక హాసిని నాగవంశీ కూడా వెళ్లారు. ఎన్టీఆర్-నాగవంశీ రిలేషన్ బాగానే వుంది. అందువల్ల ఫ్యూచర్ లో మరోసారి హారిక..త్రివిక్రమ్..ఎన్టీఆర్ ప్రాజెక్టు వుండడానికి అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.