పడి…నవ్వుతుండగా..పండగే

సినిమా సినిమాకు జోనర్ మార్చుకుంటూ వస్తున్న దర్శకుడు మారుతి లేటెస్ట్ గా అందిస్తున్న శతమానం భవతి లాంటి ఫీల్ గుడ్ మూవీ ప్రతి రోజూ పండగే. Advertisement యువి సంస్థ, గీతా సంస్థ సంయుక్తంగా…

సినిమా సినిమాకు జోనర్ మార్చుకుంటూ వస్తున్న దర్శకుడు మారుతి లేటెస్ట్ గా అందిస్తున్న శతమానం భవతి లాంటి ఫీల్ గుడ్ మూవీ ప్రతి రోజూ పండగే.

యువి సంస్థ, గీతా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాత బన్నీవాసు. సాయి ధరమ్ తేజ్-రాశీఖన్నా జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ హీరో తాతగా కీలకపాత్ర పోషిస్తున్నాడు.

డిసెంబర్ 20న విడుదల కాబోయే ఈ సినిమాలో పాట ఒకటి విడుదల చేస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

'పది మంది వున్నా, పడి..నవ్వుతున్నా పండగే అంటూ సాగే గ్రూప్ సాంగ్ ను విడుదల చేయడం ద్వారా, తను అందించబోతున్న సినిమా ఎటువంటిది? ఎలా వుండబోతోంది అన్నది ముందుగానే చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు మారుతి.

కెకె రాసిన పాటకు థమన్ సంగీతం అందించారు. కుటుంబ అనుబంధాలు, సంతోషాలు తెలిపే పాటలకు సాధారణంగా అందించే తరహా సంగీత సంచయాన్ని గుర్తు తెచ్చేలా మ్యూజిక్ ను అందించారు. ట్యూన్ క్యాచీగానే వుంది. పాట మధ్యలో మాత్రం కొంత మేరకు గీతంలా కాకుండా వచనంలా సాగినట్లు అనిపించింది.

మొత్తంగా చూసుకుంటే ప్రతి రోజూ పండగే సినిమాకు తొలి గీతం తో మంచి ప్రచారానికి బాగానే శ్రీకారం చుట్టారు.