పాన్ ఇండియా మల్టీ స్టారర్ లో శర్వా

యంగ్ హీరో శర్వాకు మంచి చాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మల్టీ స్టారర్ లో నటించబోతున్నాడు. దశాబ్దాల తరువాత సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కలిసి…

యంగ్ హీరో శర్వాకు మంచి చాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మల్టీ స్టారర్ లో నటించబోతున్నాడు. దశాబ్దాల తరువాత సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో మూడో కీలకమైన పాత్రకు శర్వానంద్ ను తీసుకున్నారు. 

రజనీ కాంత్ కు ఇది 170 వ సినిమా. రజనీ-అమితాబ్ కాంబినేషన్ లో కీలక సినిమాలు వున్నాయి. ఇన్నాళ్ల తరువాత ఆ ఇద్దరి కాంబినేషన్ అంటే క్రేజ్ మామూలుగా వుండదు. అసలే, జైలర్ సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లోకి శర్వా ఎంటర్ అవుతున్నారు. శర్వా ప్రస్తుతం పీపుల్స్ మీడియా పతాకం మీద శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. రెండు మూడు బ్యానర్లతో కమిట్ మెంట్ వుంది కానీ కథలు, డైరక్టర్లు ఫిక్స్ కాలేదు. అందరూ అనుకుంటున్నట్లు మెగాస్టార్ – కళ్యాణ్ కృష్ణ సినిమాలో అయితే శర్వా చేయడం లేదు. ఈ రోజుకు అయితే ఆ కమిట్ మెంట్ ఏమీ లేదు.

లేటస్ట్ గా ఓకె చేసింది అమితాబ్-రజనీ సినిమా మాత్రమే. మేకోవర్ అయిన తరువాత శర్వా అంత త్వరగా సినిమాలు ఓకె చేయడం లేదు. కథల విషయంలో, ప్రాజెక్ట్ ల విషయంలో చాలా కీలకంగా వున్నాడు.