Advertisement

Advertisement


Home > Movies - Movie News

నన్ను అల్లరి చేస్తున్నారు.. పోలీసులకు పవిత్ర ఫిర్యాదు

నన్ను అల్లరి చేస్తున్నారు.. పోలీసులకు పవిత్ర ఫిర్యాదు

సినీ నటి పవిత్ర లోకేష్, సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ ను ఆపాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అల్లరి చేస్తున్నారని, నరేష్ పేరును లాగి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీనియర్ నటుడు నరేష్ ను, తనను కలిపి ట్రోల్ చేస్తూ వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు పవిత్ర. తమ ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని, పైకి చెప్పుకోలేని వ్యాఖ్యానాలు జోడిస్తున్నారని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు ఆమె కొన్ని ఫేస్ బుక్ ఖాతాలు, మరికొన్ని ట్విట్టర్ యూజర్ స్క్రీన్ షాట్లు, ఇంకొన్ని యూట్యూబ్ లింకుల వివరాల్ని పోలీసులకు అందజేశారు.

43 ఏళ్ల పవిత్ర లోకేష్, నరేష్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే ప్రచారం ఉంది. దీనికి సంబంధించి నరేష్ మూడో భార్య ఆమధ్య మీడియా ఎదుట పంచాయితీ కూడా పెట్టారు. ఈమధ్య కృష్ణ కన్నుమూసిన సందర్భంలో, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్న సమయంలో కూడా పవిత్ర లోకేష్, నరేష్ పక్కనే ఉన్నారు.

ఇలా సందర్భం ఏదైనా నరేష్-పవిత్ర కలిసి కనిపిస్తున్నారు. తమ బంధాన్ని వాళ్లు బయటకు చెప్పనప్పటికీ మీమర్స్, ట్రోలర్స్ మాత్రం వీళ్లిద్దరిపై ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు. రానురాను ఇవి శృతిమించడంతో, పవిత్ర లోకేష్ ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?