పవన్ కళ్యాణ్ కమ్మవారికి పాలేరు

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రెడ్లకు పాలేరు అని అంటున్నారని, అలాగైతే పవన్ కళ్యాణ్ కమ్మవారికి పాలేరా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారన్న మీడియా వార్త ఆసక్తికరంగా ఉంది. Advertisement పవన్ వ్యాఖ్యలపై…

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రెడ్లకు పాలేరు అని అంటున్నారని, అలాగైతే పవన్ కళ్యాణ్ కమ్మవారికి పాలేరా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారన్న మీడియా వార్త ఆసక్తికరంగా ఉంది.

పవన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, పవన్ కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా అని ప్రశ్నించారు. తనను సన్నాసి అని పవన్ తిట్టాడని, తాను బూతులు మాట్లాడలేదని ఆయన చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్..ఉరేయ్ అని పిలవమని అంజనాదేవి నేర్పించారా. నేను రెడ్లకు పాలేరునైతే , పవన్ కమ్మవాళ్లకు పాలేరు. నేను జగన్ దగ్గర పాలేరునే… పవన్‌కు చెప్పే దమ్ముందా.

నన్ను అవమానించాలని చూస్తే ఆ అవమానాన్ని పరిచయం చేస్తా. దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్. రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ అని నాని విమర్శించారు.