Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇకపై ఆ సినిమా పీపుల్ మీడియాది కూడా!

ఇకపై ఆ సినిమా పీపుల్ మీడియాది కూడా!

గోపీచంద్, శ్రీనువైట్ల సినిమా బడ్జెట్ చేయి దాటిపోతోందనే ఊహాగానాలు ఇప్పటివి కావు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తమ చేతిలోకి తీసుకుంటుందనే ప్రచారం కూడా అదే టైమ్ లో మొదలైంది. ఇప్పుడదే నిజమైంది.

గోపీచంద్-శ్రీనువైట్ల సినిమాలో పీపుల్ మీడియా కూడా చేరింది. ఈ సినిమాను పూర్తిగా దక్కించుకోకుండా, నిర్మాణ భాగస్వామిగా చేరారు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్.

ఇన్నాళ్లూ పంపిణీదారుడిగా రాణించిన వేణు, ఈ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన చిత్రాలయం స్టుడియోస్ ను స్థాపించారు. అయితే సోలోగా సినిమా తీయలేకపోయారు. పైగా పీపుల్ మీడియా లాంటి భారీ నిర్మాణ సంస్థ అండ ఉంటే, బడ్జెట్ తో పాటు రిలీజ్ పరంగా నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఇలా అన్ని లెక్కలేసుకొని విశ్వప్రసాద్ తో చేతులు కలిపారు వేణు. గతంలో గోపీచంద్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉండడంతో విశ్వప్రసాద్ వెంటనే ఒప్పుకున్నారు.

ఈరోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. వేణుతో పాటు పీపుల్ మీడియా మనుషులు కూడా సెట్స్ లో కనిపిస్తారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ పార్ట్ తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి టాకీ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే వెల్లడిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?