పొలిమేర సీక్వెల్ మామూలుగా వుండదు

స‌త్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్‌ లు గా గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం…

స‌త్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్‌ లు గా గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం మా ఊరి పొలి మేర‌-2 . ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం న‌వంబ‌రు 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలోని పాత్రల ప‌రిచ‌య కార్య‌క‌మ్రం బుధ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్రంలో క‌నిపించే పాత్రల గెట‌ప్‌ల‌తోనే స‌త్యం రాజేష్‌, కామాక్షి భాస్క‌ర్ల‌, రాకేందు మౌళి, బాలాదిత్య‌, త‌దిత‌రులు హాజ‌రుకావ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా స‌త్యం రాజేష్ మాట్లాడుతూ న‌టీన‌టులు అంద‌రూ దిబెస్ట్ ఇచ్చారు. ద‌ర్శ‌కుడు ప్ర‌తిభ గురించి ఈ సినిమా ద్వారా అంద‌రికి తెలుస్తుంది. గ్యానీ సంగీతం, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. కొత్త కాన్సెప్ట‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను కొత్త లోకానికి తీసుక‌వెళుతుంది అని అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ నా సినిమాలో అన్ని పాత్ర‌లు ప్రాముఖ్య‌త పాత్రలే. చిన్న సినిమాగా మొద‌లుపెట్టిన ఈ సినిమాకు ఇంత బ‌జ్ రావ‌డం ఆనందంగా వుంది. నాకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమా మాకున్న ప‌రిధిలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. వంశీ నందిపాటి చేరిక‌తో ఈసినిమా పెద్ద సినిమాగా మారింది. పొలిమేర -1కు మించి 20 రెట్లు బాగుంటుంది వుంటుంది. త్వ‌ర‌లో పొలిమేర -3 ప‌నులు మొద‌లుపెడ‌తాం అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ఈ సినిమాలో కొమ‌ర పాత్రతో పాటు కామాకి పాత్ర ఆలోచింప‌జేస్తుంది. న‌వంబ‌రు 3న ఓ థిల్లింగ్ సినిమాను చూడ‌బోతున్నారు. త‌ప్ప‌కుండా కొత్త‌దనం ఆశించే ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అన్నారు.