Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

నేను రెడీ.. ఎవరైనా పిలవండి: పూజా హెగ్డే

నేను రెడీ.. ఎవరైనా పిలవండి: పూజా హెగ్డే

కరోనా దెబ్బకు సినిమాలన్నీ చాపచుట్టేశాయి. స్టార్ హీరోలంతా ఇళ్లల్లో కూర్చున్నారు. ఆల్రెడీ 4 నెలలు దాటిపోయింది. మళ్లీ ఎప్పుడు ఈ పెద్ద సినిమాలన్నీ సెట్స్ పైకి వస్తాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. తను షూటింగ్స్ కు రెడీ అని ప్రకటించింది.

టాలీవుడ్ లో బడా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. తను ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. ఎవరైనా తనను పిలిస్తే కచ్చితంగా సెట్స్ పైకి వస్తానని చెబుతోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో పాటు.. అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలున్నాయి. వీటిలో ఏది మొదలైనా తను షూటింగ్ కు వెళ్లడానికి రెడీగా ఉంది.

పూజా హెగ్డే ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం వెనక మరో లాజిక్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమెకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు నుంచే కాకుండా బాలీవుడ్ ఆఫర్లు కూడా రెడీగా ఉన్నాయి. చేతిలో ఉన్న సినిమాల్లో ఏదో ఒకటి సెట్స్ పైకి వస్తే తప్ప, కొత్త సినిమాలకు ఇవ్వబోయే కాల్షీట్లపై క్లారిటీ రాదు. అందుకే ఇలా షూటింగ్స్ కు రెడీ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది పూజా హెగ్డే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?