ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆ ఆనందమైనా దక్కుతుందా?

రాధేశ్యామ్ ఫ్లాప్ తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అతడి నుంచి మరో సినిమా వచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. అయితే రాధేశ్యామ్ థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటీటీలో హిట్ అయితే సంబరపడాలనుకున్నారు. కానీ…

రాధేశ్యామ్ ఫ్లాప్ తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అతడి నుంచి మరో సినిమా వచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. అయితే రాధేశ్యామ్ థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటీటీలో హిట్ అయితే సంబరపడాలనుకున్నారు. కానీ వాళ్లకు ఆ అవకాశం కూడా దక్కలేదు. అమెజాన్ లో వచ్చిన రాధేశ్యామ్ కు నార్త్ బెల్ట్ లో తప్పితే, పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

అలా రాధేశ్యామ్ గాయాలను అనుభవిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇప్పుడు మరో చిన్న అవకాశం వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీవీల్లోకి రాబోతోంది. కనీసం టీఆర్పీల్లోనైనా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తే, ట్రెండింగ్ చేసి పండగ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులకు రాధేశ్యామ్ ఆ చిట్టచివరి ఆనందాన్నయినా అందిస్తుందా?

రాధేశ్యామ్ శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. ఈ నెలలోనే సినిమాను ప్రసారం చేయబోతోంది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయి రేటింగ్ రావాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం టీఆర్పీల పరంగా అల వైకుంఠపురములో సినిమాదే నంబర్ వన్ స్థానం. ఆ తర్వాత స్థానంలో సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ఈ రెండు సినిమాలను క్రాస్ చేయకపోయినా, కనీసం ఈ సినిమాల స్థాయిలో టీఆర్పీ వస్తే చాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది రాధేశ్యామ్ సినిమా. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇండియాలోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. రాధాకృష్ణ, తమన్ కలిసి ఈ సినిమాను లేపడానికి ఎంతగానో కృషిచేశారు. కానీ వాళ్ల ప్రయత్నం ఫలించలేదు.