దేవర 2 భాగాలు.. ప్రశాంత్ నీల్ ముందు జాగ్రత్త

ఎప్పుడైతే దేవర సినిమా 2 భాగాలుగా రాబోతోందని దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించాడో, ఆ వెంటనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. వీళ్లిద్దరి కాంబోలో సినిమా మరింత…

ఎప్పుడైతే దేవర సినిమా 2 భాగాలుగా రాబోతోందని దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించాడో, ఆ వెంటనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. వీళ్లిద్దరి కాంబోలో సినిమా మరింత ఆలస్యం కావొచ్చంటూ కథనాలు కూడా వచ్చేశాయి. దీంతో నీల్ తో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ కూడా అలర్ట్ అయింది.

తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించింది. దేవర పార్ట్-1 అదే టైమ్ లో థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. సో.. దేవర పార్ట్-1 రిలీజైన వెంటనే, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వస్తుందని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది మైత్రీ.

మరి దేవర పార్ట్-2 సంగతేంటి..? దీనిపై కూడా చిన్నపాటి క్లారిటీ వచ్చినట్టే. ప్రశాంత్ నీల్ తో సినిమా పూర్తయిన తర్వాతే దేవర పార్ట్-2 మొదలవుతుంది. ఇక్కడ కేవలం ఎన్టీఆర్ ఒక్కడు మాత్రమే కాదు. టోటల్ టీమ్ అంతా దేవర పార్ట్-1తో డిటాచ్ అవ్వబోతోంది. సైఫ్, జాన్వి కూడా ఇతర ప్రాజెక్టుల మీదకు వెళ్తారు. ఒక్క కొరటాల మాత్రమే పార్ట్-2 పనిమీద ఉంటాడు.

మొత్తమ్మీద ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ముందుజాగ్రత్త చర్యలు బాగానే తీసుకున్నారు. ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరిపి, అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకొని, పక్కాగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అలా తమ టైమ్-మనీ వేస్ట్ అవ్వకుండా చూసుకోవడంతో పాటు.. ఎన్టీఆర్ ను కూడా లాక్ చేసినట్టయింది.